Andhra Pradesh news: తెదేపా సానుభూతిపరుడిపై వైకాపా నేతల దాడి

తెదేపా సానుభూతిపరుడిపై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాళ్లో చోటు చేసుకుంది.

Published : 20 Aug 2023 20:05 IST

రెంటచింతల: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాళ్లలో తెదేపా సానుభూతిపరుడు సర్వారెడ్డిపై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. అతడి కారును కూడా ధ్వంసం చేశారు. గాయపడిన సర్వారెడ్డిని స్థానికులు గురజాల ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరోసారి అతడిపై వైకాపా నేతలు మరోసారి దాడి చేశారు. బలవంతంగా రెంటచింతల పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతడిపై కేసు పెట్టేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఇవాళ ఉదయమే సర్వారెడ్డి ఇంటికి మాచర్ల తెదేపా ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి వెళ్లారు. ఆ తర్వాతే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని