Kerala: కేరళలోని దుకాణంలో ఆసక్తికరమైన చోరీ..

కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లోని ఓ దుకాణంలో ఆసక్తికరమైన చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు ఓ దుకాణంలోకి చొరబడి వస్తువులను ఎత్తుకెళ్లారు. కనిపించినవల్లా తీసుకెళ్లకుండా తమ ఇంట్లోకి కావాల్సిన సామాను

Updated : 03 Jul 2022 08:38 IST

కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లోని ఓ దుకాణంలో ఆసక్తికరమైన చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు ఓ దుకాణంలోకి చొరబడి వస్తువులను ఎత్తుకెళ్లారు. కనిపించినవల్లా తీసుకెళ్లకుండా తమ ఇంట్లోకి కావాల్సిన సామాను మాత్రమే దోచేశారు. గ్యాస్‌ స్టౌ, టేబుల్‌ మ్యాట్లు, గొడుగు వంటి వస్తువులను తీసుకెళ్లారు. ఏ వస్తువులు దొంగతనం చేయాలో ముందుగానే అంచనాకు వచ్చి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. అనుకున్న వస్తువులన్నీ చోరీ చేశాక.. ఒక దొంగ క్యాష్‌ కౌంటర్‌ ఓపెన్‌ చేశాడు. అందులో ఉన్న రూ.3వేల నగదు, ఓ మొబైల్‌ ఫోన్‌ను తీసుకెళ్లిపోయాడు. వీరితో పాటు వచ్చిన మూడో వ్యక్తి దుకాణం బయట ఉన్నాడు. లోపలున్న దొంగలు తీసుకొచ్చిన వస్తువులను అతడు ఓ ఆటోలో నింపి తీసుకెళ్లాడు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.80వేల విలువైన సామగ్రి చోరీకి గురైనట్లు దుకాణ యజమాని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని