Amarinder Singh: కాంగ్రెస్‌ పరాభవానికి గాంధీలే కారణం: అమరీందర్‌

పంజాబ్‌తోపాటు మొత్తం ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి

Published : 15 Mar 2022 11:01 IST

చండీగఢ్‌: పంజాబ్‌తోపాటు మొత్తం ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి గాంధీలే కారణమని పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలను దృష్టిలో పెట్టుకొని సోమవారం ఓ ప్రకటనలో ఈ వ్యాఖ్య చేశారు. తాను సీఎం పదవి నుంచి దిగిపోయేనాటికి పంజాబ్‌లో కాంగ్రెస్‌ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. స్వీయ వైఫల్యాలను హుందాగా అంగీకరించకుండా.. పార్టీ వర్కింగ్‌ కమిటీ తనపైకి ఆ నిందను తోసేందుకు ప్రయత్నిస్తోందని అమరీందర్‌ విమర్శించారు. పంజాబ్‌లోనే కాకుండా ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవాల్లోనూ కాంగ్రెస్‌ దారుణంగా పరాజయం పాలైందని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని