Amarinder Singh: కాంగ్రెస్ పరాభవానికి గాంధీలే కారణం: అమరీందర్
పంజాబ్తోపాటు మొత్తం ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి
చండీగఢ్: పంజాబ్తోపాటు మొత్తం ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి గాంధీలే కారణమని పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలను దృష్టిలో పెట్టుకొని సోమవారం ఓ ప్రకటనలో ఈ వ్యాఖ్య చేశారు. తాను సీఎం పదవి నుంచి దిగిపోయేనాటికి పంజాబ్లో కాంగ్రెస్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. స్వీయ వైఫల్యాలను హుందాగా అంగీకరించకుండా.. పార్టీ వర్కింగ్ కమిటీ తనపైకి ఆ నిందను తోసేందుకు ప్రయత్నిస్తోందని అమరీందర్ విమర్శించారు. పంజాబ్లోనే కాకుండా ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవాల్లోనూ కాంగ్రెస్ దారుణంగా పరాజయం పాలైందని గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?