హార్దిక్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా!
ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో ఓటమిపాలైనప్పటికీ భారత్ 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ సిరీస్లో ధనాధన్ ఇన్నింగ్స్లతో అలరించిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ లభించింది
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో ఓటమిపాలైనప్పటికీ భారత్ 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ సిరీస్లో ధనాధన్ ఇన్నింగ్స్లతో అలరించిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ లభించింది. అయితే తనకి దక్కిన అవార్డును యువ సంచలన బౌలర్ టీ నటరాజన్కు హార్దిక్ అందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో కెరీర్ ఆరంభ మ్యాచ్ల్లోనే గొప్పగా బౌలింగ్ చేసిన నటరాజన్కు ఈ అవార్డు దక్కాలని ట్విటర్ వేదికగా తెలిపాడు.
‘‘నటరాజన్.. ఈ సిరీస్లో నువ్వు చేసిన ప్రదర్శన అద్భుతం. అరంగేట్ర మ్యాచ్ల్లోనే క్లిష్ట పరిస్థితుల్లో గొప్పగా బౌలింగ్ చేసిన విధానమే చెబుతుంది నీ శ్రమ, సామర్థ్యాల గురించి. నా దృష్టిలో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ దక్కాల్సింది నీకే. సిరీస్ గెలిచినందకు టీమిండియాకు శుభాకాంక్షలు’’ అని నటరాజన్, భారత జట్టు ఫొటోలతో హార్దిక్ ట్వీట్ చేశాడు. రెండో టీ20లో హార్దిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న అనంతరం కూడా నట్టూకే అవార్డు దక్కాల్సిందని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే నటరాజన్ను ప్రోత్సహిస్తున్న హార్దిక్ను నెటిజన్లు కొనియాడుతున్నారు. తన గొప్ప మనుసును ప్రశసింస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు చేస్తున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం నటరాజన్కే టీ20 సిరీస్ ట్రోఫీని అందించడం విశేషం. యువ ఆటగాడిని ప్రోత్సహిస్తున్న తీరు స్ఫూర్తిదాయకంగా ఉందని కోహ్లీని ప్రశసింస్తున్నారు.
బ్యాట్స్మెన్కు సమాధానం దొరకని యార్కర్లు, ఆఫ్ కట్టర్లు, నెమ్మది బంతులతో నటరాజన్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. సీనియర్ పేసర్లు బుమ్రా, షమి జట్టులో లేకపోయినా పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాపై భారత్ టీ20 సిరీస్ గెలవడంలో నటరాజన్ కీలకపాత్ర పోషించాడు. తొలి టీ20లో మూడు వికెట్లతో సత్తాచాటాడు. రెండో టీ20లో సహచరులంతా భారీ పరుగులు ఇవ్వగా అతడు నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మంగళవారం జరిగిన ఆఖరి టీ20లోనూ అందరికంటే పొదుపుగా బౌలింగ్ చేసి ఒక్క వికెట్ తీశాడు.
ఇదీ చదవండి
కోహ్లీ పోరాడినా భారత్కు తప్పని ఓటమి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే