MS Dhoni: వీరాభిమానం.. ధోనీని కలిసేందుకు 1400 కి.మీ. కాలినడక
ఓ అభిమాని సాహసమే చేశాడు. తన ఫేవరేట్ను కలిసేందుకు ఏకంగా 1400 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాడు. హరియాణాలోని తన గ్రామం నుంచి నడక ప్రారంభించిన అజయ్ గిల్ (18) అనే అభిమాని 1400 కి.మీ. నడిచి....
రాంచీ: భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత్లో మిస్టర్ కూల్ క్రేజ్ అంతాఇంతా కాదు. ధోనీపై అభిమానులు తమ అభిమానాన్ని ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఓ అభిమాని సాహసమే చేశాడు. తన ఫేవరేట్ను కలిసేందుకు ఏకంగా 1400 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాడు. హరియాణాలోని తన గ్రామం నుంచి నడక ప్రారంభించిన అజయ్ గిల్ (18) అనే అభిమాని 1400 కి.మీ. నడిచి ఝార్ఖండ్లోని రాంచీకి చేరుకున్నాడు. జులై 29న పయనమైన అజయ్ 17 రోజుల పాటు నడిచి ధోనీ స్వస్థలమైన రాంచీకి చేరుకున్నాడు.
ఇంత సాహసం చేసినా.. ఆ యువకుడికి నిరాశే ఎదురైంది. గిల్ రాంచీకి చేరుకునే రెండు రోజుల ముందే ఐపీఎల్ కోసం ధోనీ దుబాయ్కి పయనమయ్యాడు. అయినప్పటికీ తన ఫేవరేట్ తిరిగొచ్చేవరకు ఇక్కడే ఎదురుచూస్తానని ఈ యువకుడు పేర్కొన్నాడు. మహీని కలిసిన తర్వాతే తిరిగి వెళతానని చెప్పాడు. ‘ఇంతదూరం కాలినడకన వచ్చినందుకు ధోనీ నాతో 10 నిమిషాలైనా మాట్లాడతాడు’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు అజయ్.
తన స్వగ్రామంలోని ఓ సెలూన్లో పనిచేసే అజయ్ చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు. జుట్టుకు పసుపు, ఆరెంజ్, నీలం రంగులు వేసుకొని.. తలకు రెండు వైపులా ధోనీ, మహీ అనే పేర్లతో దర్శనమిస్తున్నాడు. ధోనీని కలిసేందుకు నడుచుకుంటూ వెళుతున్నాననే విషయం తెలుసుకున్న సోనేపత్లోని ఓ బార్బర్ తనను ఇలా తయారుచేసినట్లు అజయ్ తెలిపాడు. క్రికెటర్ కావాలని కలలు కన్నానని.. కానీ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ ఆడటం మానేశానని గిల్ తెలిపాడు. మహీ ఆశీర్వాదంతోనే మళ్లీ క్రికెట్ ఆడాలని భావిస్తున్నట్లు వివరించాడు.
అజయ్ గురించి తెలుసుకున్న అనురాజ్ చావ్లా అనే వ్యక్తి.. యువకుడిని ఓ హోటల్ రూంకి తీసుకెళ్లారు. ధోనీ వచ్చేందుకు ఇంకా చాలారోజులు పట్టనుండటంతో ఇంటికి వెళ్లాలని అతడికి సూచించారు. కాలినడకన వచ్చినందుకు అతడికి దిల్లీ వరకు విమాన టికెట్ను అందించారు. మహీ వచ్చాక మళ్లీ రావాలని అజయ్కి సూచించినట్లు అనురాగ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434