దిల్లీ జట్టులోకి గుల్బాదిన్‌

గాయంతో ఐపీఎల్‌ 17వ సీజన్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్‌ మార్ష్‌ స్థానాన్ని అఫ్గానిస్థాన్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌ గుల్బాదిన్‌ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్‌ భర్తీ చేసింది.

Published : 26 Apr 2024 02:18 IST

దిల్లీ: గాయంతో ఐపీఎల్‌ 17వ సీజన్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్‌ మార్ష్‌ స్థానాన్ని అఫ్గానిస్థాన్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌ గుల్బాదిన్‌ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్‌ భర్తీ చేసింది. కనీస ధర రూ.50 లక్షలకు గుల్బాదిన్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్ష్‌ ఆ తర్వాత గాయంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆడిన మ్యాచ్‌ల్లోనూ మార్ష్‌ పెద్దగా ఆకట్టుకోలేదు. 61 పరుగులే చేసిన అతను.. ఒక్కటే వికెట్‌ తీశాడు. మరోవైపు గుల్బాదిన్‌కు ఇదే మొదటి ఐపీఎల్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని