IND vs SA: తొలి టెస్టులోనే కాదు.. డబ్ల్యూటీసీ మొత్తం వీరిపైనే చర్చ: హర్భజన్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో (SA vs IND) ఒకే ఒక్కస్థానంపై గురి కుదరడం లేదు. ఎవరిని తీసుకోవాలనేదే భారత మేనేజ్మెంట్ ముందున్న అసలైన చిక్కు ప్రశ్న.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా టీమ్ఇండియాలో (SA vs IND) ఒకే ఒక్క స్థానంపై తీవ్ర చర్చ జరుగుతోంది. పేస్ ఆల్రౌండర్ను ఆడించాలా..? స్పిన్ ఆల్రౌండర్ను తుది జట్టులోకి తీసుకోవాలా? అనేది మేనేజ్మెంట్ ముందున్న కఠిన సవాల్. సెంచూరియన్ వేదికగా తొలి టెస్టులోనూ ఇదే సమస్య. అయితే.. బాక్సింగ్ డే టెస్టులో అశ్విన్ను ఆడించాలని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సూచించాడు.
‘‘శార్దూల్ లేదా అశ్విన్.. ఇప్పుడిదే అతిపెద్ద చర్చ. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ మొత్తం ఇదే హాట్ టాపిక్. గత డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగిన మైదానం పూర్తిగా భిన్నంగా ఉంది. తొలి రోజు నుంచే పిచ్ సీమ్కు అనుకూలంగా మారింది. అప్పుడు శార్దూల్ ఎంపిక సరైందే. ఆ పిచ్ పరిస్థితులకు అతడే కరెక్ట్. పిచ్ మీద గ్రాస్ ఎక్కువగా ఉంది. కానీ, అతడు ప్రభావం చూపించలేదు. ఇప్పుడు, బాక్సింగ్ డే టెస్టులో పిచ్ పరిస్థితులకు అశ్విన్ సరైన ప్లేయర్గా భావిస్తున్నా. తొలి రోజు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మ్యాచ్ జరిగే కొద్దీ అశ్విన్ కీలకమవుతాడు. అందుకే, అశ్విన్ ఈ టెస్టులో ఆడితే బాగుంటుంది’’ అని భజ్జీ తెలిపాడు.
ఓపెనర్లుగా వారిద్దరే..
‘‘ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగాలి. శుభ్మన్ గిల్ వన్డౌన్లో రావాలి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ.. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఆర్డర్ బెటర్. నంబర్ 8లో అశ్విన్ లేదా శార్దూల్ ఎవరు ఉంటారనేది పెద్ద ప్రశ్న. బుమ్రా, సిరాజ్, ప్రసిధ్ చివర్లో బ్యాటింగ్కు వస్తారు’’ అని హర్భజన్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM