Babar Azam: టీమ్ఇండియాపై పాక్ ప్రధాని సెటైర్.. బాబర్ అజామ్ స్పందన ఇదే..
టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమ్ఇండియా సెమీస్ను ఘోర పరాభవంతో నిష్క్రమించడంపై పాక్ ప్రధాని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఆయన చేసిన ‘‘152/0 vs 170/0’’ వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అంచనాలను తలకిందులు చేస్తూ టీ20 ప్రపంచకప్లో ఫైనల్కు దూసుకెళ్లింది పాకిస్థాన్. మెల్బోర్న్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్తో జరిగే టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఫైనల్ సన్నద్ధతపై పాక్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఓటమిని విమర్శిస్తూ పాక్ ప్రధాని చేసిన ట్వీట్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బాబర్ స్పందించాడు. ఆ ట్వీట్ గురించి తాను మాట్లాడలేనని తెలిపాడు.
కీలక సెమీస్ పోరులో భారత జట్టు.. ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఒక్క వికెట్ కోల్పోకుండా 169 పరుగుల లక్ష్య ఛేదనను ఇంగ్లాండ్ పూర్తి చేసింది. దీంతో ఆ మ్యాచ్ అనంతరం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్విటర్ వేదికగా టీమ్ఇండియాపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘152/0 vs 170/0’’ అని ట్వీట్ చేశారు. 152/0 అంటే గతేడాది టీ20 ప్రపంచకప్లో భారత్పై ఛేదనలో పాక్ చేసిన స్కోరు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్పై వికెట్ కోల్పోకుండా విజయాలు సాధించిన ఈ రెండు జట్లు ఈ సారి ఫైనల్లో తలపడుతున్నాయన్న అర్థంలో.. టీమ్ఇండియాను విమర్శిస్తూ పాక్ ప్రధాని ఈ ట్వీట్ చేశారు. ఇది కాస్తా నెట్టింట వైరల్గా మారింది.
ఈ ట్వీట్ గురించి మీడియా సమావేశంలో విలేకరులు పాక్ కెప్టెన్ను ప్రశ్నించారు. దీనికి బాబర్ బదులిస్తూ.. ‘‘క్షమించాలి. నేను ఆ ట్వీట్ చూడలేదు. దానిపై నాకు అవగాహన లేదు కాబట్టి నేను మాట్లాడలేను. అయితే ప్రత్యర్థిపై అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు మేం 100శాతం ప్రయత్నిస్తాం’’ అని తెలిపాడు. ఇక.. 1992 వన్డే ప్రపంచకప్ టోర్నీకి.. ఇప్పటి టీ20 ప్రపంచకప్నకు కొన్ని పోలికలు ఉన్నాయని బాబర్ అన్నాడు. ‘‘ఈ ట్రోఫీని సాధించేందుకు 100 శాతం ప్రయత్నిస్తాం. మాకు ఆరంభం సరిగా లేకపోయినా.. జట్టు అద్భుతంగా పుంజుకొని రావడం ఆనందంగా ఉంది. మా వాళ్లు పులుల్లా పోరాడారు. తుది పోరులోనూ ఇలాగే ప్రయత్నించి కప్ను సాధిస్తాం’’ అని పాక్ సారథి పేర్కొన్నాడు. 1992 ప్రపంచకప్ టోర్నీని కూడా పాకిస్థాన్ జట్టు ఓటమితో ఆరంభించింది. ఆ టోర్నీలోనూ భారత్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. ఫైనల్కు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి