Yuzvendra Chahal: ఈ టీ20 ప్రపంచకప్లో చాహల్ కీలకంగా ఉంటాడు: బ్రాడ్హాగ్
టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తిరిగి ఫామ్లోకి రావడంపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్హాగ్ హర్షం వ్యక్తం చేశాడు. చాహల్ ఇటీవలి కాలంలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడని మెచ్చుకున్నాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తిరిగి ఫామ్లోకి రావడంపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్హాగ్ హర్షం వ్యక్తం చేశాడు. చాహల్ ఇటీవలి కాలంలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడని మెచ్చుకున్నాడు. కొన్నాళ్ల క్రితం సరైన ప్రదర్శన చేయలేక జట్టులో స్థానం కోల్పోయిన టీమ్ఇండియా స్పిన్నర్ ఇప్పుడు వికెట్లు తీస్తూ జట్టులో కీలకంగా మారాడు. అయితే, రాబోయే టీ20 ప్రపంచకప్లోనూ అతడు ఆస్ట్రేలియాలో మరింత మెరుస్తాడని బ్రాడ్హాగ్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న అతడు.. చాహల్ గురించి ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘చాహల్ ఏడాది కాలంగా బాగా మెరుగవ్వడం గమనిస్తున్నా. దీంతో ఈసారి ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్లోనూ అతడు మరింత అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడని నమ్ముతున్నా. ఒకానొక సందర్భంలో అతడు జట్టులో నుంచి వైదొలిగిన పరిస్థితుల నుంచి ఇప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకొని తిరిగి పుంజుకునే స్థాయికి ఎదిగాడు. అతడు వ్యక్తిగతంగా కూడా పరిణతి చెందాడు. దీంతో ఈసారి టీమ్ఇండియా ఫేవరెట్ జట్లలో ఒకటని కచ్చితంగా చెబుతాను. టీ20 క్రికెట్లో లెగ్ స్పిన్నర్ ఉంటే ఏ జట్టుకైనా బాగా కలిసొస్తుంది. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్లను ఇబ్బంది పెట్టే వీలుంటుంది. అలాంటప్పుడు ఈసారి చాహల్ టీమ్ఇండియా తరఫున రాణిస్తాడని గట్టిగా నమ్ముతున్నా’ అని బ్రాడ్హాగ్ చెప్పుకొచ్చాడు.
కాగా, చాహల్ గతేడాది టీ20 ప్రపంచకప్లో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటీవల భారత టీ20 లీగ్ 15వ సీజన్లో రాజస్థాన్ తరఫున ఆడిన అతడు 17 మ్యాచ్ల్లో 27 వికెట్లు సాధించి నంబర్ వన్ బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలోనే మళ్లీ టీమ్ఇండియా జట్టులో స్థానం సంపాదించుకొని అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ కీలక వికెట్లు పడగొడుతున్నాడు. తాజాగా రెండో వన్డేలో లార్డ్స్లో ఏకంగా 4/47 మెరుగైన ప్రదర్శన చేసి అక్కడ టీమ్ఇండియా తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం