India vs Srilanka: నిజానికి లంకేయులే భారత్కు రుణపడ్డారు!
బీసీసీఐ ద్వితీయ శ్రేణి భారత జట్టును పంపించిందన్న అర్జున రణతుంగ వ్యాఖ్యలతో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా విభేదించాడు. ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ ఇలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నాడు...
శ్రీలంకకు టీమ్ఇండియాను పంపడమే గొప్ప అంటున్న కనేరియా
ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ ద్వితీయ శ్రేణి భారత జట్టును పంపించిందన్న అర్జున రణతుంగ వ్యాఖ్యలతో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా విభేదించాడు. ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ ఇలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నాడు. కేవలం మీడియాలో ప్రచారం కోసం ఆయన అలా వ్యాఖ్యానించి ఉంటారని అభిప్రాయపడ్డాడు. నిజానికి బీసీసీఐ భారత జట్టును పంపించి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నందుకు సంతోషించాలని వెల్లడించాడు.
‘భారత్ ద్వితీయ శ్రేణి జట్టును పంపించకూడదని రణతుంగ అంటున్నాడు. ఆయనేం మాట్లాడుతున్నాడో నాకర్థం కాలేదు. 1996లో ప్రపంచకప్ గెలిచిన ఆయనకు అంతర్జాతీయంగా మంచి పేరుంది. బహుశా ఆయన ప్రచారం కోసమే ఇలాంటి ప్రకటన చేసుండొచ్చు. అంతర్జాతీయ క్రికెట్ ఆడగలిగే 50-60 మంది క్రికెటర్లు భారత్కు ఉన్నారు. వారు రెండు జట్లను సులువుగా ఏర్పాటు చేయగలరు’ అని కనేరియా అన్నాడు.
‘భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య సహా నిరంతరం టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్లను టీమ్ఇండియా పంపించింది. రణతుంగ అలాంటి ప్రకటనలు ఇవ్వడం బాధాకరం. అలాంటి ప్రకటనలు చేయొద్దని శ్రీలంక క్రికెట్ ఆయనకు చెప్పాల్సింది’ అని కనేరియా పేర్కొన్నాడు.
‘ప్రస్తుతం లంక క్రికెట్ పతనావస్థలో ఉంది. ఇంగ్లాండ్ సిరీస్ ఇందుకు ఉదాహరణ. అన్ని మ్యాచుల్లో ఓటమి పాలయ్యారు. వారు క్రికెట్ ఆడటం దాదాపుగా మర్చిపోయారు. వారిని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు భారత జట్టును పంపించినందుకు రుణపడి ఉండాలి. టీమ్ఇండియా సులభంగా ఈ రెండు సిరీసులు గెలిచేస్తుంది’ అని కనేరియా ధీమా వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM