WPL: గుజరాత్కు మరో ఓటమి.. అగ్రస్థానానికి దిల్లీ
గుజరాత్కు మరో ఓటమి. దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants)కు ఓటమి పరంపర కొనసాగుతూనే ఉంది. దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులే చేసింది. అష్లే గార్డెనర్ (40) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దిల్లీ బౌలర్లలో జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్ తలో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. ఈ విజయంతో దిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక గుజరాత్ జట్టు ఇంతవరకు ఖాతా తెరవలేదు. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ ఓటమి చవిచూసింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ (55: 41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. మిగతావారు భారీ ఇన్సింగ్స్లు ఆడకున్నా మెరుగైన స్కోరు సాధించడంలో సహకారం అందించారు. గుజరాత్ బౌలర్లలో మేఘనా సింగ్ 4, గార్డెనర్ రెండు వికెట్లు తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్