WPL: గుజరాత్‌కు మరో ఓటమి.. అగ్రస్థానానికి దిల్లీ

గుజరాత్‌కు మరో ఓటమి. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.  

Updated : 03 Mar 2024 22:59 IST

బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)లో గుజరాత్‌ జెయింట్స్‌ (Gujarat Giants)కు ఓటమి పరంపర కొనసాగుతూనే ఉంది. దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులే చేసింది. అష్లే గార్డెనర్‌ (40) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దిల్లీ బౌలర్లలో జెస్‌ జోనాస్సెన్‌, రాధా యాదవ్‌ తలో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. ఈ విజయంతో దిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక గుజరాత్‌ జట్టు ఇంతవరకు ఖాతా తెరవలేదు. ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన దిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మెగ్‌ లానింగ్‌ (55: 41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. మిగతావారు భారీ ఇన్సింగ్స్‌లు ఆడకున్నా మెరుగైన స్కోరు సాధించడంలో సహకారం అందించారు. గుజరాత్‌ బౌలర్లలో మేఘనా సింగ్‌ 4, గార్డెనర్‌ రెండు వికెట్లు తీశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని