Avesh - Pant : అవేశ్ ఖాన్కు ‘సారీ’ చెప్పిన పంత్... ఎందుకో తెలుసా?
టీమ్ఇండియా వికెట్ కీపర్, దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్...
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్ఇండియా వికెట్ కీపర్, దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్కు ‘సారీ’ చెప్పాడు. ఇంతకీ అవేశ్కు రిషభ్ ఎందుకు క్షమాపణ చెప్పాడనేగా మీ డౌటు.. ఐపీఎల్ మెగా వేలంలో అవేశ్ ఖాన్ను తిరిగి దక్కించుకునేందుకు దిల్లీ ప్రయత్నించినా కుదరలేదు. లఖ్నవూ సూపర్ జెయింట్స్ భారీ మొత్తం చెల్లించి మరీ సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలం చరిత్రలోనే అన్క్యాప్డ్ ఆటగాళ్లలో అవేశ్ ఖాన్ (రూ.10 కోట్లు) అధిక ధరను దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం కోల్కతా వేదికగా విండీస్తో టీమ్ఇండియా మూడు టీ20ల సిరీస్ను ఆడనుంది. మ్యాచ్లకు అవేశ్ ఖాన్ ఎంపిక కావడంతో కోల్కతాకు వెళ్లాడు.
ఈడెన్గార్డెన్స్లో ఉన్న రిషభ్ పంత్ను అవేశ్ ఖాన్ కలిశాడు. ఈ సందర్బంగా అవేశ్ ఖాన్ను పంత్ హగ్ చేసుకుని అభినందిస్తూనే క్షమాపణలు తెలిపాడు. ‘‘కోల్కతాలో దిగగానే నేను రిషభ్ను కలిశాను. నన్ను హగ్ చేసుకుని అభినందించాడు. తీసుకోలేకపోయినందుకు క్షమించు.. అని అన్నాడు. భారీ మొత్తం లేకపోవడంతో కొనుగోలు చేయడం కుదర్లేదని తెలిపాడు. అప్పటికీ రూ.8.75 కోట్ల వరకు దిల్లీ బిడ్ వేసింది. అయితే లఖ్నవూ ఇంకా అధికంగా ఆఫర్ చేసింది. అయితే ఇప్పుడు రిషభ్ను కలవడం ఎంతో భావోద్వేగం కలిగిస్తుంది. మేమిద్దరం కలిసి అండర్-19 క్రికెట్ కూడా ఆడాం. మ్యాచ్ ముగిసాక ఇద్దరం కలిసి మాట్లాడుకునేవాళ్లం’’ అని అవేశ్ ఖాన్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.