రిటైర్మెంట్ తర్వాత ధోనీ తొలి పోస్ట్ ఇదే!
ఇతర క్రికెటర్లతో పోలిస్తే టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ సామాజిక మాధ్యమాల్లో అంత చురుకుగా ఉండని విషయం తెలిసిందే. తన గారాలపట్టి జీవాతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు మాత్రం అప్పుడప్పుడు...
ఇంటర్నెట్డెస్క్: ఇతర క్రికెటర్లతో పోలిస్తే టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ సామాజిక మాధ్యమాల్లో అంత చురుకుగా ఉండని విషయం తెలిసిందే. తన గారాలపట్టి జీవాతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు మాత్రం అప్పుడప్పుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటుంటాడు. అయితే గత ఏడాది ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మహీ ఇన్స్టాలో మరో పోస్ట్ చేయలేదు. తన కెరీర్లో ముఖ్యమైన జ్ఞాపకాలతో ఓ వీడియో పోస్ట్ చేసి.. అంతర్జాతీయ క్రికెట్కు అనూహ్యంగా ధోనీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
అయితే ఎన్నో నెలల తర్వాత ధోనీ తన ఇన్స్టాగ్రామ్లో మరో వీడియో షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. సేంద్రీయ పద్ధతుల్లో తాను పండిస్తున్న స్ట్రాబెర్రీని తింటూ వీడియో షేర్ చేశాడు. ‘పొలంలో ఇలానే నేను ముందుకెళ్తే.. మార్కెట్లో అమ్మడానికి ఒక్క స్ట్రాబెర్రీ కూడా మిగలదు’ అని దానికి సరదాగా వ్యాఖ్య జత చేశాడు. కాగా, పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లో ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. నాలుగు గంట్లోనే 43 లక్షల మంది పైగా వీక్షించారు.
వీడ్కోలు పలికిన తర్వాత నుంచి ధోనీ తన జీవితాన్ని బిజీగా గడుపుతున్నాడు. గతేడాది రాంచీలో 2వేల కడక్నాథ్ కోళ్లతో పౌల్ట్రీ ఫాం ప్రారంభించగా.. ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ పద్ధతుల్లో వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నాడు. అంతేగాక పండించిన స్ట్రాబెర్రీ, క్యాబేజీ, టమోటా సహా ఇతర కూరగాయల్ని దుబాయ్కి ఎగుమతులు చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నాడని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఇప్పటికే ధోనీ క్షేత్రంలో పండించే కూరగాయలకు రాంచీ మార్కెట్లో మంచి డిమాండు ఉంది.
ఇదీ చదవండి
రోహిత్, గిల్ ఏకాగ్రతను దెబ్బతీయాలని..
200+ డాడీ హండ్రెడ్ అయితే 300+ ఏంటి?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.