IND w Vs AUS w: కీలక సమయంలో.. అలా రన్నింగ్ చేయడమేంటి?: డయానా ఎడుల్జీ
మహిళల ప్రపంచకప్లో (Womens T20 World Cup 2023) ఫైనల్కు రావడంలో మరోసారి టీమ్ఇండియా (Team India) విఫలమైంది. కీలక సమయంలో వికెట్లను చేజార్చుకొని ఆసీస్ చేతిలో (IND w Vs AUS w) ఓటమిపాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రపంచకప్ (Womens World Cup 2023) సెమీస్లో టీమ్ఇండియాకి భంగపాటు తప్పలేదు. చివరి వరకు పోరాడినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో (INDw Vs AUS w) ఓటమిపాలైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet kaur) రనౌట్ కావడమే కీలక మలుపుగా మాజీలతో సహా అభిమానులు చెబుతున్న వేళ.. టీమ్ఇండియా (Team India) మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ మాత్రం హర్మన్ రన్నింగ్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. విజయానికి చేరువగా వచ్చిన మ్యాచ్ను చేజార్చడంలో ప్లేయర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని వ్యాఖ్యానించింది. షాట్ల సెలెక్షన్పైనా ఎడుల్జీ ( Diana Edulji) అసంతృప్తి వ్యక్తం చేసింది. కీలక సమయంలో వికెట్ల మధ్య పరుగెత్తేటప్పుడు హర్మన్ ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది.
‘‘మనమంతా మ్యాచ్ను వీక్షించాం. బ్యాట్ క్రీజ్కు ముందు స్టక్ అయిపోయినట్లు హర్మన్ (Harmanpreet kaur) భావించింది. కానీ, సరిగ్గా పరీక్షిస్తే.. ఆమె రెండో రన్ కోసం వచ్చేటప్పుడు జాగింగ్ చేస్తున్నట్లు ఉంది. నీ వికెట్ చాలా ముఖ్యమని తెలిసినప్పుడు అంత రిలాక్స్డ్గా ఎందుకు పరుగెత్తావు? గెలవాలంటే ప్రొఫెషనల్ క్రికెట్ను ఆడాల్సిందే. రెండో పరుగు కోసం హర్మన్ చాలా సాధారణంగా పరిగెత్తింది. క్రీజ్లోకి చేరిపోతానని భావించింది. కానీ అలా జరగలేదు. ఒక్కసారి ఆసీస్ ఫీల్డర్ పెరీ డైవ్ను చూడండి. బౌండరీ వెళ్తుందేమోనని అంతా భావించిన వేళ.. అనూహ్యంగా డైవ్ చేసి మరీ ఆపింది. రెండు పరుగులను కాపాడింది. అదీ ప్రొఫెషనలిజం క్రికెట్ అంటే. వారు చివరి వరకూ పోరాడారు. మనం మాత్రం విజయం కోసం పోరాడటానికి సిద్ధంగా లేకపోయాం. ప్రతిసారి ఆఖరి పోరులో బోల్తా కొట్టడం అలవాటైపోయింది’’
‘‘ఇక షఫాలీ తనను పక్కన పెట్టరని భావిస్తే పొరపాటే అవుతుంది. ఈ మ్యాచ్లో (ఆసీస్తో సెమీస్) షెఫాలీ వర్మ షాట్ సెలెక్షన్ అత్యంత దారుణంగా ఉంది. ఆమె ఔటైన వీడియోను చూశా. అలాంటి బంతికి కూడా ఔట్ కావడం సరైందేనా..? షాట్ ఎంపిక చాలా చెత్తగా ఉంది. ఇంతకుముందు జరిగిన అండర్ -19 ప్రపంచకప్లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. కానీ, ఆమె మాత్రం తన బ్యాటింగ్లో రాణించలేదు. మరో ఓపెనర్ శ్వేతా షెరావత్ అద్భుతంగా ఆడింది. మరో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ సూపర్ బ్యాటింగ్ చేసింది. కానీ, కీలకమైన సమయంలో అవసరం లేని షాట్ ఆడి మరీ వికెట్ను చేజార్చుకుంది. అంతకుముందే బౌండరీ రాబట్టిన తర్వాత అలాంటి షాట్ అవసరమా...? అని అనిపించింది. మ్యాచ్ పరిస్థితినిబట్టి ఆడాలి.. ఇటీవల మెగా టోర్నీల్లో స్మృతీ మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ నిలకడగా ఆడలేకపోతున్నారు. అందుకే భారత్ గెలవలేకపోతోంది. వారిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. కానీ, కఠిన శిక్షణ మాత్రం ఇవ్వడం లేదనిపిస్తోంది. నాణ్యమైన బ్యాటింగ్ విభాగం ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని ఎడుల్జీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.