T20 World Cup: టీ20 ప్రపంచకప్.. ధోనీ సేన ‘మెరుపులు’ రోహిత్ సేన మరిపించేనా..?
టీ20 ఫార్మాట్లో తొలిసారి ప్రవేశపెట్టిన ప్రపంచకప్ టైటిల్ను టీమ్ఇండియా కైవసం చేసుకొంది. ఇక ఆ తర్వాత గత టీ20 ప్రపంచకప్ వరకు ఒక్కసారి కూడానూ మన ఖాతాలో వచ్చి చేరలేదు. మరోసారి ఆసీస్ వేదికగా పొట్టి కప్ కోసం భారత్ బరిలోకి దిగింది.
టీమ్ఇండియా తొలి పొట్టి ప్రపంచకప్ను నెగ్గి 15 వసంతాలను పూర్తి చేసుకొంది. కొత్త కెప్టెన్.. కొంగొత్త ఫార్మాట్.. పదిహేను మంది సభ్యులు కలిగిన జట్టులో కేవలం ఐదుగురికి మాత్రమే కాస్త ఎక్కువ అంతర్జాతీయ అనుభవం ఉంది. కానీ అంతకుముందే జరిగిన వన్డే ప్రపంచకప్లో సచిన్-దాదా-ద్రవిడ్-లక్ష్మణ్ వంటి దిగ్గజాలతో కూడిన భారత్ ఘోర పరాభవం ఎదుర్కొంది. వాటన్నింటినీ అధిగమించి ‘కెప్టెన్ కూల్’ ధోనీ నాయకత్వంలో పాకిస్థాన్ను చిత్తు చేసి మరీ టైటిల్ను ఖాతాలో వేసుకొని భారత్ సంచలనం సృష్టించింది. దక్షిణాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి క్రికెట్ పండగొచ్చింది. ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. 22వ తేదీ నుంచి సూపర్ 12 దశలో మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి.
ఎప్పుడో పదిహేనేళ్ల కిందట టీ20 ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత్.. తాజాగా టైటిల్ వేటలో వెనుకబడిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ఇండియా ప్రపంచకప్ కోసం బరిలోకి దిగింది. తొలి మ్యాచ్ను అక్టోబర్ 23న పాకిస్థాన్తో తలపడనుంది. తొలిసారి ప్రపంచకప్ను అందుకొన్న జట్టులో సభ్యుడైన రోహిత్ శర్మ.. ఈసారి కెప్టెన్గా వ్యవహరిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు లేకపోవడం భారత్కు కాస్త ఇబ్బందిగాకరంగా మారే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడున్న జట్టులో స్టార్లకు కొదవేంలేదు. 2007 టీ20 ప్రపంచకప్ విజేత జట్టుతో పోలిస్తే ప్రస్తుత స్క్వాడ్ కాస్త పైచేయి సాధిస్తుంది. కానీ, ధోనీ నాయకత్వంలోని జట్టుకు.. ఇప్పటి రోహిత్ సేనకు మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుంటే కప్ను సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
అప్పట్లో అలా..
రోహిత్ సేనలో అంతా స్టార్లే..
తొలి టీ20 ప్రపంచకప్ను నెగ్గిన తర్వాత 2008లో భారత టీ20 లీగ్ వచ్చాక.. ఈ ఫార్మాట్లో కొత్త స్టార్లు పుట్టుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా లీగుల్లోనే పెద్ద సంఖ్యలో మ్యాచ్లను ఆడేశారు. టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొనే ఈ ఏడాది రోహిత్ నాయకత్వంలో భారీగా పొట్టి మ్యాచ్లను ఆడటం విశేషం. టీ20 ప్రపంచకప్-2022కు వేదిక ఆస్ట్రేలియా. ఫాస్ట్ పిచ్లతోపాటు బ్యాటింగ్కు కాస్త అనుకూలంగా ఉంటాయి. దీంతో రోహిత్, రాహుల్, విరాట్, సూర్యకుమార్, దినేశ్ కార్తిక్, రిషభ్ పంత్, దీపక్ హుడా.. వంటి హిట్టర్లతోపాటు హార్దిక్ పాండ్య, అశ్విన్, అక్షర్ పటేల్ ఆల్రౌండర్లతో టీమ్ఇండియా బరిలోకి దిగుతోంది. అయితే ప్రదర్శనలో నిలకడలేమి ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. స్థిరంగా టోర్నీ ఆద్యంతం ఆడేది ఒకరిద్దరు మాత్రమే. మిగతావారు ఎప్పుడు ఎలా ఆడతారో అంచనా వేయడం కష్టం.
బౌలింగ్లో ప్రధాన తేడా అదే..
మరిప్పుడో..
ప్రస్తుత టీమ్ఇండియా జట్టుకు ఏకైక ఫోబియా.. 19వ ఓవర్.. ఇన్నింగ్స్లోని అన్ని ఓవర్లను అద్భుతంగా వేసే స్టార్ బౌలర్లు సైతం ఈ ఓవర్ వచ్చేసరికి ఎందుకో ధారాళంగా పరుగులు ఇచ్చేస్తారు. అది బుమ్రా, సిరాజ్, హర్షల్, భువనేశ్వర్, అర్ష్దీప్ అయినా సరే బాదుడు మాత్రం తప్పడంలేదు. ఈ ప్రపంచకప్నకు బుమ్రా దూరం కాగా.. పేస్ బౌలింగ్ దళం హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్, షమీ/సిరాజ్ చేతుల మీదుగా దాడి చేయనుంది. వీరంతా మ్యాచ్ విన్నర్లే.. కానీ, 19వ ఓవర్ వేయనంతవరకే సుమా.. ఎందుకంటే ఇటీవల ఆసియా కప్ నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ల వరకు పరిశీలిస్తే నిజమేనని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. డెత్ ఓవర్ల సమస్యను అధిగమిస్తేనే భారత్ కప్ వేటలో ముందుండే అవకాశం ఉంది. మరి ఆ బౌలర్ ఎవరు అవుతారో తెలియాలంటే వేచి చూడాలి. అంతేకాకుండా ఇటీవల నోబాల్స్ వేయడం యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్కు పరిపాటిగా మారింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో ఒకే ఓవర్లో రెండు నోబాల్స్ వేయడం గమనార్హం.
ఫీల్డింగ్లో మెరు‘పులులే’..
‘‘శ్రీశాంత్ పట్టింది కేవలం క్యాచ్ మాత్రమే కాదు.. టీమ్ఇండియాకు ప్రపంచకప్’’ ఇవి ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలు..
ఘోర వైఫల్యం.. కోహ్లీనే నయం..?
గత కొన్ని మ్యాచ్లను పరిశీలిస్తే రోహిత్ నాయకత్వంలోని టీమ్ఇండియా ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా ఉన్నాయి. చురుగ్గా ఉండే రవీంద్ర జడేజా దూరం కావడం భారత్ను మరింత కష్టాల్లో నెట్టినట్లే. యువ ఆటగాళ్లు కూడా బంతిని ఆపడంలో బాగా వెనుకబడిపోయారు. తొలి పొట్టి ప్రపంచకప్ జట్టుతో పోలిస్తే ఇప్పుడున్న ఆటగాళ్ల సగటు వయసును ఊహించలేం. ఎందుకంటే అప్పుడు సగటు కేవలం 23 ఏళ్లు మాత్రమే. అందులో ఒక్కరు కూడా 30 ఏళ్లు దాటిన ఆటగాడు లేకపోవడం గమనార్హం. కానీ, ఈసారి మాత్రం ఐదుగురు తప్పితే మిగతా అందరి వయసు 30కిపైనే. మొదటి టీ20 ప్రపంచకప్లో సభ్యులైన రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. దినేశ్ కార్తిక్ హార్డ్ హిట్టర్.. టీమ్ఇండియా సగటు వయసును చూస్తే ఆశ్చర్య పోవడం మీ వంతవుతుంది. ఎందకంటారా..? అది 30.6 కావడం విశేషం. అయితే ఇందులో ఫిట్నెస్పరంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ మాత్రమే ముందుంటారు. అందుకే గత ‘మెరుపులు’.. ఈసారి మాత్రం పెద్దగా ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అక్కడ ధోనీ ఉన్నాడు..
దూకుడు ఉన్నా.. నిర్ణయాల్లో కనిపించదు!
ఇటీవల రోహిత్ శర్మ మైదానంలో ప్రవర్తించే తీరును చూస్తే.. సగటు అభిమాని కూడా కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నాడు. ఎందుకంటే సొంత జట్టు సభ్యులపైనే అసహనం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఏదైనా క్యాచ్ను వదిలిపెట్టినా.. ఫీల్డింగ్లో, డీఆర్ఎస్ తీసుకోవడంలో తప్పిదం జరిగినా.. వెంటనే తన ముఖ కవళికలు మారిపోతున్నాయి. ఇటీవల ఆసియా కప్లో అర్ష్దీప్ క్యాచ్ డ్రాప్ ఘటననే తీసుకొందాం.. వెంటనే తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్గా మారింది. కీలకమైన క్యాచ్ అయినప్పటికీ.. అలా ప్రవర్తిస్తే సదరు ఆటగాడి ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫెరెన్స్లో అర్ష్దీప్పై జరిగిన ట్రోలింగ్ను తప్పుబడుతూ.. యువ బౌలర్కు మద్దతుగా నిలిచాడు. ప్రత్యర్థులపై దూకుడుగా ఉంటే ఫర్వాలేదు కానీ.. సొంత ఆటగాళ్లపై ఇలా కస్సుబుస్సులాడితే మాత్రం జట్టు ప్రదర్శనపైనే ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.