కెరీర్పై భయంతో పుజారా ఏడ్చిన వేళ..
భారత టెస్టు జట్టులో అత్యంత విలువైన ఆటగాళ్లలో చెతేశ్వర్ పుజారా ఒకడు.
ముంబయి: భారత టెస్టు జట్టులో అత్యంత విలువైన ఆటగాళ్లలో చెతేశ్వర్ పుజారా ఒకడు. గంటలు గంటలు క్రీజులో నిలిచే పుజారా మానసిక దృఢత్వం గురించి తరచుగా చర్చ జరుగుతుంటుంది. అలాంటి పుజారా ఒకప్పుడు కెరీర్ పట్ల తీవ్ర ఆందోళనతో ఏడ్చాడట. పూర్తి ప్రతికూల ఆలోచనలతో మానసిక వేదనకు గురయ్యాడట. తాను క్రికెట్లో కొనసాగలేనేమో అని భయపడ్డాడట. ఓ ఇంటర్వ్యూలో ఆ రోజులను అతను గుర్తు చేసుకున్నాడు. ‘‘కెరీర్ ఆరంభంలో నాకు తొలిసారి పెద్ద గాయం అయింది. అది నా కెరీర్లోనే అత్యంత కఠిన సమయం. జట్టు ఫిజియో నా దగ్గరికొచ్చి కోలుకోవడానికి ఆరు నెలల దాకా సమయం పట్టొచ్చన్నాడు. నేను తీవ్ర నిరాశకు గురై ఏడ్చేశాను. అప్పుడు నా ఆలోచనలన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. మళ్లీ క్రికెట్ ఆడగలనా.. అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగగలనా అని సందేహాలు కలిగాయి’’ అని పుజారా చెప్పాడు. ఈ దశ నుంచి ఎలా కోలుకున్నది వివరిస్తూ.. ‘‘తర్వాత నెమ్మదిగా నా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాట్లాడుతుంటే నాలో ధైర్యం వచ్చింది. అంతా సర్దుకుంటుందని వాళ్లు ధైర్యం చెప్పారు. భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి వర్తమానం మీద దృష్టి పెట్టా. అదే సమయంలో యోగా, ధ్యానం చేయడంతో మళ్లీ సానుకూల ఆలోచనల్లోకి వచ్చా’’ అని పుజారా తెలిపాడు. ఒకప్పుడు ఒత్తిడిని తట్టుకోలేక అమ్మ దగ్గరికెళ్లి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని, కానీ తర్వాత నెమ్మదిగా ఒత్తిడిని అధిగమించడం అలవాటైందని చెతేశ్వర్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు