MS Dhoni: కొబ్బరి బొండం పట్టుకుని.. టీమ్‌ ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి..

న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌ కోసం రాంచీకి వచ్చిన భారత జట్టును గురువారం ఓ అతిథి కలుసు కున్నాడు.

Updated : 27 Jan 2023 07:12 IST

రాంచి: న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌ కోసం రాంచీకి వచ్చిన భారత జట్టును గురువారం ఓ అతిథి కలుసు కున్నాడు. దీంతో శిబిరం ఉత్సాహంతో నిండిపోయింది. అతడే మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని. కొబ్బరి బొండం చేతిలో పట్టుకుని చాలా సాధారణంగా డ్రెస్సింగ్‌రూమ్‌లోకి వచ్చిన ధోనిని భారత ఆటగాళ్లు చుట్టుముట్టారు.

మొదట టీ20 కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యతో మాట్లాడిన మహి.. ఆపై వికెట్‌కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు సూచనలు ఇస్తూ కనిపించాడు. శుభ్‌మన్‌ గిల్‌, చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌తో కూడా ధోని మాట్లాడాడు. ఈ సందర్భంగా ట్విటర్‌లో బీసీసీఐ ఓ వీడియో పంచుకుంది. ‘‘రాంచిలో భారత శిబిరానికి ఎవరు వచ్చారో చూడండి..  ‘ద గ్రేట్‌ మహి’ అని శీర్షిక కూడా జోడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని