NZ Vs SL: ఆఖరి బంతికి అద్భుతం
టెస్టు మ్యాచ్లకు రసవత్తర ముగింపునిస్తున్న న్యూజిలాండ్ మరోసారి తన ప్రత్యేకతను చాటింది. రెండు వారాల క్రితం ఇంగ్లాండ్పై ఒక్క పరుగు ఆధిక్యంతో సంచలన విజయం సాధించిన కివీస్.. సొంతగడ్డపై మరో అద్భుతం చేసింది.
ఉత్కంఠ పోరులో శ్రీలంకపై కివీస్ విజయం
క్రైస్ట్చర్చ్: టెస్టు మ్యాచ్లకు రసవత్తర ముగింపునిస్తున్న న్యూజిలాండ్ మరోసారి తన ప్రత్యేకతను చాటింది. రెండు వారాల క్రితం ఇంగ్లాండ్పై ఒక్క పరుగు ఆధిక్యంతో సంచలన విజయం సాధించిన కివీస్.. సొంతగడ్డపై మరో అద్భుతం చేసింది. అయిదు రోజుల పాటు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. కేన్ విలియమ్సన్ (121 నాటౌట్; 194 బంతుల్లో 11×4, 1×6) అద్భుత సెంచరీ సాధించిన వేళ.. తొలి టెస్టులో శ్రీలంకపై కివీస్ పైచేయి సాధించింది. సోమవారం తీవ్ర ఉత్కంఠ నడుమ ముగిసిన మ్యాచ్లో కివీస్ రెండు వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గి రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఓవర్నైట్ స్కోరు 28/1తో అయిదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్.. 285 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా మ్యాచ్ చివరి బంతికి ఛేదించింది. 70 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. వర్షం కారణంగా సుమారు 4 గంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ వన్డే తరహాలో సాగింది. మూడున్నర గంటల్లో కనీసం 52 ఓవర్ల ఆట నిర్వహించడానికి అంపైర్లు నిర్ణయించగా.. విలియమ్సన్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ (81; 86 బంతుల్లో 3×4, 4×6) నాలుగో వికెట్కు 142 పరుగులు జోడించి జట్టును గెలుపు దిశగా నడిపించారు. అయితే పేసర్ అసిత ఫెర్నాండో (3/63) కొన్ని పరుగుల వ్యవధిలో మిచెల్, బ్లండెల్ (3), బ్రాస్వెల్ (10)లను ఔట్ చేశాడు. కెప్టెన్ సౌథీ (1)ని లహిరు కుమార (1/61) వెనక్కి పంపాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. 7 బంతుల్లో.. కివీస్కు 12 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ మూడో బంతికి హెన్రీ (4) రనౌటయ్యాడు. 3 బంతుల్లో 5 పరుగులు కావాలి. నాలుగో బంతిని విలియమ్సన్ బౌండరీ బాదాడు. స్కోరు సమమైంది. అయిదో బంతి పరుగులేమీ రాలేదు. చివరి బంతికి ఒక్క పరుగు కావాలి. ఫెర్నాండో బౌన్సర్ విసరగా బంతి.. బ్యాట్కు అందకుండా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. నాన్ స్ట్రైకర్ వాగ్నర్ (0 నాటౌట్) రన్ కోసం పరుగెత్తగా కీపర్ డిక్వెల్లా త్రో విసిరాడు. వికెట్లను తాకకుండా వచ్చిన బంతిని అందుకున్న బౌలర్ ఫెర్నాండో నాన్ స్ట్రైకర్ వైపు విసిరాడు. బంతి వికెట్లను తాకడంతో శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే రీప్లేలో అది నాటౌట్గా తేలడంతో కివీస్ కేరింతలు మిన్నంటాయి. తొలి ఇన్నింగ్స్లో లంక 355, కివీస్ 373 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్లో లంక 302 పరుగులకు ఆలౌటైంది. ఈ నెల 17న వెల్లింగ్టన్లో రెండో టెస్టు ప్రారంభమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!