పుజారా పాఠాలు అమూల్యం
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ముంగిట తన సహచరులకు భారత సీనియర్ చెతేశ్వర్ పుజారా చెప్పబోయే పాఠాలు అమూల్యమైనవని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
పోర్ట్స్మౌత్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ముంగిట తన సహచరులకు భారత సీనియర్ చెతేశ్వర్ పుజారా చెప్పబోయే పాఠాలు అమూల్యమైనవని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. భారత ఆటగాళ్లలో చాలామంది గత రెండు నెలలుగా ఐపీఎల్లో మునిగి ఉండగా.. పుజారా మాత్రం ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. అతడికి కౌంటీల్లో చాలా అనుభవమే ఉంది. ఈ సీజన్లో ససెక్స్ క్లబ్కు కెప్టెన్గా కూడా వ్యవహరించిన పుజారా.. సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు. ఈ నేపథ్యంలో సన్నీ మాట్లాడుతూ.. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే ఓవల్ మైదానంలో పుజారా ఈ మధ్య మ్యాచ్ ఆడి ఉండకపోవచ్చు. కానీ లండన్ నుంచి అతను ప్రాతినిధ్యం వహించే ససెక్స్ ఎంతో దూరం కాదు. కాబట్టి ఓవల్ పిచ్ ఎలా స్పందిస్తుందో తనకు అవగాహన ఉంటుంది. సహచర బ్యాటర్లతో పాటు కెప్టెన్కు అతను చెప్పబోయే పాఠాలు అమూల్యమైనవి. స్టీవ్ స్మిత్తోనూ కలిసి ఆడాడు అతడి కోసం వ్యూహాలు రూపొందించడానికి కూడా పుజారా ఉపయోగపడతాడు’’ అని చెప్పాడు. ఐపీఎల్ అయిన వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్న భారత బ్యాటర్లు కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుందని సన్నీ అభిప్రాయపడ్డాడు. ‘‘వాళ్లు బ్యాట్ వేగం మీద దృష్టిపెట్టాలి. టీ20ల్లో ఆడేటపుడు బ్యాట్ వేగం ఎక్కువ ఉంటుంది. టెస్టు మ్యాచ్లో వేగాన్ని నియంత్రించుకోవాలి. అందులోనూ స్వింగ్ ఎక్కువగా ఉండే ఇంగ్లాండ్లో సాధ్యమైనంత ఆలస్యంగా బంతిని ఆడే ప్రయత్నం చేయాలి. బంతిని త్వరగా అందుకునే ప్రయత్నం చేస్తే పొరపాటు అవుతుంది’’ అని గావస్కర్ అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్కు ఎదురయ్యే సవాళ్ల గురించి సన్నీ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లాండ్ పరిస్థితులే అతి పెద్ద సవాల్. మామూలుగా మన దగ్గర మ్యాచ్ ఆడుతుంటే సూర్యుడు మన వెంటే ఉంటాడు. అక్కడ అసలు ఎండే ఉండదు. వాతావరణం ఎప్పుడూ మబ్బులు పట్టి.. చల్లగా ఉంటుంది. అప్పుడప్పుడూ జెర్సీ మీద స్వెట్టర్ వేసుకోవాల్సిన అవసరం పడుతుంది. బంతి కూడా గాల్లో ఎక్కువ స్వింగ్ అవుతుంది. అందుకే ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి రెండు మూడు వార్మప్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది’’ అని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.