మళ్లీ అగ్రస్థానానికి గుకేశ్‌

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌ పుంజుకున్నాడు. ఎనిమిదో రౌండ్లో 38 ఎత్తుల్లో విదిత్‌ గుజరాతీపై గెలిచి తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఖాతాలో 5 పాయింట్లు ఉన్న అతడు నెపోమ్నియాషి (రష్యా)తో కలిసి ఆధిక్యంలో ఉన్నాడు.

Published : 15 Apr 2024 02:21 IST

క్యాండిడేట్స్‌ చెస్‌ 

టొరంటో: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌ పుంజుకున్నాడు. ఎనిమిదో రౌండ్లో 38 ఎత్తుల్లో విదిత్‌ గుజరాతీపై గెలిచి తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఖాతాలో 5 పాయింట్లు ఉన్న అతడు నెపోమ్నియాషి (రష్యా)తో కలిసి ఆధిక్యంలో ఉన్నాడు. ఏడో రౌండ్లో ఓటమితో గుకేశ్‌ రెండో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. అలీ రెజా (ఫ్రాన్స్‌)తో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించాడు. ఇతర గేముల్లో నిజత్‌ అబసోవ్‌ (అజర్‌బైజాన్‌)పై నెపోమ్నియాషి, కరువానా (అమెరికా)పై నకముర (అమెరికా) విజయం సాధించారు. మరో ఆరు రౌండ్లు మిగిలి ఉన్న టోర్నమెంట్లో ప్రజ్ఞానంద, నకముర చెరో 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. మహిళల విభాగంలో వైశాలి (2.5)పై కోనేరు హంపి (3.5) విజయం సాధించింది. అయిదేసి పాయింట్లతో జ్యోంగి తాన్‌ (చైనా), టింజీ లీ (చైనా), గోర్యాచ్కినా (రష్యా) ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని