పంత్‌ పైకి.. కోహ్లి కిందికి

ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గణనీయమైన పురోగతి సాధించగా.. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టాప్‌-10లో స్థానం కోల్పోయాడు.

Published : 07 Jul 2022 03:44 IST

టాప్‌-10లో స్థానం కోల్పోయిన విరాట్‌

దుబాయ్‌: ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గణనీయమైన పురోగతి సాధించగా.. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టాప్‌-10లో స్థానం కోల్పోయాడు. బుధవారం ప్రకటించిన జాబితాలో పంత్‌ అయిదో ర్యాంకు సాధించాడు. ఇంగ్లాండ్‌తో టెస్టులో వరుసగా 146, 57 పరుగులతో అలరించిన పంత్‌.. తాజా ర్యాంకింగ్స్‌లో అయిదు స్థానాలు మెరుగయ్యాడు. కోహ్లి ర్యాంకింగ్‌పై అతని ప్రదర్శన తీవ్ర ప్రభావం చూపింది. అతను 4 స్థానాలు కోల్పోయి 13వ ర్యాంకులో నిలిచాడు. టెస్టు ర్యాంకింగ్స్‌ టాప్‌-10లో కోహ్లి లేకపోవడం ఆరేళ్లలో ఇదే తొలిసారి. కొవిడ్‌ కారణంగా ఇంగ్లాండ్‌తో అయిదో టెస్టుకు దూరమైన కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఒక స్థానం కోల్పోయి 9వ ర్యాంకులో నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకంతో మెరిసిన జో రూట్‌ (ఇంగ్లాండ్‌) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని