IND vs ENG : తొలి వన్డేలో రోహిత్‌ భారీ సిక్సర్‌... పాపకు గాయం.. చాక్లెట్‌ ఇచ్చిన కెప్టెన్‌

ఇంగ్లాండ్‌తో ముగిసిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ ఐదు భారీ సిక్సర్లు కొట్టాడు

Updated : 14 Jul 2022 19:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో ముగిసిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ ఐదు భారీ సిక్సర్లు కొట్టాడు. అయితే, డేవిడ్‌ విల్లీ వేసిన ఐదో ఓవర్లో ఓబంతిని రోహిత్ ఫుల్‌షాట్‌ ఆడాడు. అయితే, ఈ బంతి నేరుగా వెళ్లి  స్టాండ్స్‌లో మ్యాచ్‌ వీక్షిస్తున్నఓ పాపకు తగిలింది. దీంతో ఆ చిన్నారి ఉక్కిరి బిక్కిరి అయింది. పాపను ఎత్తుకొన్న తండ్రి ఓదార్చే ప్రయత్నం చేశాడు. కాసేపటికే ఇంగ్లాండ్‌ ఫిజియోలు అక్కడికి వెళ్లి పాపకు చికిత్స చేశారు. రోహిత్‌ కూడా దగ్గరకు వెళ్లి చూశాడు. పాప బాగానే ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారికి రోహిత్ శర్మ చాక్లెట్‌ ఇచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని