IND vs WI: వరుసగా మూడో వైట్వాష్పై కన్నేసిన రోహిత్.. ఎవరికి అవకాశం ఇచ్చేనో!
టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ కెప్టెన్గా వరుసగా మూడో సిరీస్ వైట్వాష్పై కన్నేశాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ చేపట్టిన అతడు తాజాగా టెస్టు క్రికెట్ పగ్గాలూ అందుకున్నాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ కెప్టెన్గా వరుసగా మూడో సిరీస్ వైట్వాష్పై కన్నేశాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ చేపట్టిన అతడు తాజాగా టెస్టు క్రికెట్ పగ్గాలూ అందుకున్నాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా అతడి సారథ్యంలో తొలుత న్యూజిలాండ్పై 3-0తో టీ20 సిరీస్, ఇటీవల విండీస్పై 3-0తో వన్డే సిరీస్లను వైట్వాష్ చేసింది. ఇక తాజాగా జరుగుతున్న టీ20 సిరీస్లోనూ రోహిత్సేన ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. దీంతో మరికొద్ది గంటల్లో జరిగే మూడో టీ20 లోనూ విజయం సాధించి మరో సిరీస్ వైట్వాష్ చేయాలని చూస్తోంది.
అయితే, ఇలాంటి కీలక మ్యాచ్లో తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు బీసీసీఐ విరాట్ కోహ్లీతో పాటు రిషభ్ పంత్కు పది రోజుల విశ్రాంతి కల్పించడంతో రిజర్వ్బెంచ్ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. అందులో ప్రధానంగా రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్లకు చోటు దక్కే వీలుంది. ఈ సిరీస్కు ముందు కేఎల్ రాహుల్ గాయపడటంతో ఇషాన్ కిషన్కు అవకాశమిచ్చారు. అయితే, అతడు రెండు మ్యాచ్ల్లోనూ విఫలమవడంతో ఈసారి రుతురాజ్ను తుది జట్టులోకి తీసుకునే వీలుంది. అలాగే కోహ్లీ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను కూడా పరీక్షించొచ్చు. ఇక బౌలర్ల జాబితాలో దీపక్ హూడా, మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్ సైతం తుది జట్టులో చోటు దక్కించుకోవచ్చు. సీనియర్లు బుమ్రా, షమి ఈ సిరీస్కు లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్ల్లో భువనేశ్వర్, హర్షల్ పటేల్ రాణించారు. వీరి స్థానాల్లో ఎవరికైనా అవకాశమిస్తారో లేదో చూడాల్సి ఉంది. కాగా, ఈ పర్యటనకు ముందు విండీస్ స్వదేశంలో ఇంగ్లాండ్పై 3-2 తేడాతో టీ20 సిరీస్ కైవసం చేసుకొని ఆశ్చర్యం కలిగించగా భారత్లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. దీంతో ఎలాగైనా ఈ చివరి మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.