Virat Kohli: వన్డేల్లో కోహ్లీ 49వ సెంచరీ.. నేను అలా అనడం తప్పే: శ్రీలంక కెప్టెన్
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల సౌతాఫ్రికాపై సెంచరీ వన్డేల్లో 49వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దీనిపై కామెంట్ చేసి విమర్శలపాలైన శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ (Kusal Mendis) అలా జరగడానికి గల కారణాన్ని వివరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ బాదాడు. ఈ క్రమంలోనే తన వన్డే కెరీర్లో 49వ సెంచరీ పూర్తి చేసి.. సచిన్ తెందూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు. 277వ ఇన్నింగ్స్ల్లో కోహ్లీ ఈ ఫీట్ అందుకోగా.. సచిన్ 452 ఇన్నింగ్స్ల్లో సాధించాడు. అయితే, కోహ్లీ శతకం గురించి ఓ ప్రెస్మీట్లో శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ (Kusal Mendis) కామెంట్ చేసి విమర్శలపాలయ్యాడు. వన్డే కెరీర్లో 49వ సెంచరీ చేసి అత్యధిక శతకాలు రికార్డును సమం చేసినందుకు కోహ్లీని అభినందించాలనుకుంటున్నారా అని జర్నలిస్ట్ అడిగాడు. దీనికి మెండిస్ ‘‘నేను అతనిని ఎందుకు అభినందిస్తాను?’’(నవ్వుతూ) అని సమాధానమిచ్చాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ మెండిస్పై విమర్శలు చేశారు. తాజాగా ఈ అంశంపై స్పందించిన మెండిస్.. తాను అలా చేసి ఉండకూడదని, అలా జరగడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
‘‘ఆ రోజు నేను ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్లాను. విరాట్ సెంచరీ చేశాడనే విషయం నాకు తెలియదు. అకస్మాత్తుగా ఓ జర్నలిస్ట్ ఆ ప్రశ్న అడగడంతో నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంతేకాదు నాకు ఆ ప్రశ్న స్పష్టంగా అర్థం కాలేదు. 49 వన్డే సెంచరీలు సాధించడం అంత తేలికైన పని కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ ఒకడు. నేను చెప్పింది పూర్తిగా తప్పు అని తర్వాత గ్రహించాను. ఏది ఏమైనా నేను అలా స్పందించి ఉండకూడదు’’ అని కుశాల్ మెండిస్ వివరించాడు.
కోహ్లీ సెంచరీ.. మహ్మద్ హఫీజ్కు కౌంటర్ ఇచ్చిన మైఖేల్ వాన్
కోహ్లీ సౌతాఫ్రికాపై సెంచరీ బాది వన్డేల్లో 49వ శతకం పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం కోసం కోహ్లీ స్వార్థంగా ఆడాడని పాక్ మాజీ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ విమర్శించాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ (Michael Vaughan) తనదైన శైలిలో హఫీజ్కు కౌంటర్ ఇచ్చాడు. ఇంగ్లాండ్తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోయిన వెంటనే ‘‘విరాట్ కోహ్లీలాగే పాకిస్థాన్ ఆటగాళ్లకు కొంత స్వార్థం అవసరం’’ అని ఎక్స్లో పోస్ట్ చేస్తూ మహ్మద్ హఫీజ్ని ట్యాగ్ చేశాడు. ఈ ప్రపంచకప్లో పాకిస్థాన్ నాలుగు మ్యాచ్ల్లోనే గెలిచి సెమీస్కు దూరమైంది. పాక్ ఆటగాళ్లకు గెలవాలనే స్వార్థం లేకపోవడం వల్లే నాకౌట్కు చేరుకోలేకపోయారని అర్థం వచ్చేలా మైఖేల్వాన్ ఆ పోస్టు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో