IPL 2021:అబుదాబి చేరుకున్న రోహిత్ శర్మ, బుమ్రా
ఇంగ్లాండ్తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దు కావడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను యూఏఈకి తరలించడంపై దృష్టిసారించాయి. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ జట్టు ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ శనివారం ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్లో అబుదాబి చేరుకున్నారు. ఈ విషయాన్ని
(Photo:Mumbai Indians Twitter)
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దు కావడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను యూఏఈకి తరలించడంపై దృష్టిసారించాయి. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ జట్టు ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ శనివారం ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్లో అబుదాబి చేరుకున్నారు. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్ ధ్రువీకరించింది.‘ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా,సూర్యకుమార్ యాదవ్ తమ కుటుంబాలతో ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్లో అబుదాబి చేరుకున్నారు. వీరందరూ ఐపీఎల్ నిబంధనల మేరకు ఈ రోజు(శనివారం) నుంచి ఆరు రోజులపాటు కఠిన క్వారంటైన్లోకి వెళతారు. ఇంగ్లాండ్ నుంచి బయలుదేరే ముందు వీరికి ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేశాం. అబుదాబి చేరుకున్న తర్వాత కూడా మళ్లీ ఆర్టీ-పీసీఆర్ టెస్టులు జరిపాం. ఈ రెండింటిలో అందరికీ నెగిటివ్ వచ్చింది’ అని ముంబయి ఒక ప్రకటనలో తెలిపింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తమ ఆటగాళ్లను దుబాయ్కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. సెప్టెంబరు 19న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో ఐపీఎల్-14 సీజన్ పున:ప్రారంభం కానుంది. బయోబుడగలో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కొవిడ్ బారినపడటంతో మే మొదటివారంలో ఐపీఎల్ వాయిదాపడిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.