IND vs PAK: బహిష్కరించేంత దమ్ము పాకిస్థాన్ జట్టుకు లేదు: కనేరియా
భారత్ - పాకిస్థాన్.. ఒక దేశానికి మరొక జట్టు వెళ్లదు. గత పద్నాలుగేళ్లుగా తటస్థ వేదికల్లోనే తలపడుతున్నాయి. అయితే వచ్చే ఏడాది భారత్లో వన్డే ప్రపంచకప్, పాక్ వేదికగా ఆసియా కప్ జరగనుంది. ఈ క్రమంలో ఇరుదేశాల బోర్డు పెద్దలు చేసిన వ్యాఖ్యలు సంచలన రేపాయి.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరిగే ఆసియా కప్లో భారత్ ఆడకపోతే.. వన్డే ప్రపంచకప్లో మేం ఆడేది లేదంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రజా తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే రమీజ్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘ఏ దేశం భారత్ను శాసించలేదు’’ అని కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో పాక్కే చెందిన మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా పీసీబీ ఛైర్మన్ వ్యాఖ్యలపై స్పందించాడు. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల నుంచి వైదొలిగే దమ్ము పాక్కు లేదని విమర్శించాడు.
‘‘ఐసీసీ మెగా టోర్నీలో పాక్ పాల్గొనకుండా ఉండే దమ్ము లేదు. ఒక వేళ అలా చేసినా పాక్కే నష్టం తప్ప.. భారత్కు కాదు. వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ ఆడినా, ఆడకపోయినా బీసీసీఐ పట్టించుకోదు. వారికి చాలా భారీ మార్కెట్ ఉంది. రెవెన్యూ కూడా అదే స్థాయిలో ఉంటుంది. వన్డే ప్రపంచకప్ కోసం భారత్లో పర్యటించకపోతే పాక్ నష్టపోవాల్సి వస్తుంది. ఐసీసీ నుంచి ఒత్తిడి ఉంటే తప్పకుండా పాక్ ఆడాల్సిందేనని అధికారులు చెప్పే అవకాశం లేకపోలేదు. పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితినిబట్టి రమీజ్ రజా ఇలాంటి ప్రకటనలు చేయడం సరైంది కాదు. ఆసియా కప్ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. ఇలానే చేస్తే బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ కూడా బాయ్కాట్ చేసే ప్రమాదం లేకపోలేదు. అప్పటికి పరిస్థితుల్లో మార్పులు వచ్చి ఏమైనా జరగొచ్చు’’ అని కనేరియా వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.