Ramiz Raja: మా వల్లే అప్పుడు భారత్ కెప్టెన్ను మార్చింది: రమీజ్ రజా
పాకిస్థాన్ ఓడితే చాలు టీమ్ఇండియాపై మాటలతో పడిపోవడం రమీజ్ రజాకి అలవాటు. పీసీసీ చీఫ్గా తన హయాంలో భారత్పై గెలవడంతో రెచ్చిపోతుంటాడు. అయితే తన పదవి పోయినా మాత్రం టీమ్ఇండియాపై అక్కసు మాత్రం వెళ్లగక్కడంలో మాత్రం ఆగలేదు.
ఇంటర్నెట్ డెస్క్: చింత చచ్చినా పులుపు చావలేదనట్లుగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవి పోయినా రమీజ్ రజా భారత్ జట్టుపై అక్కసు మాత్రం వెళ్లగక్కుతూనే ఉన్నాడు. బలవంతంగా ఆ పదవి నుంచి తప్పించినా సరే తన గొప్పలను చెప్పడంలో తగ్గడం లేదు. ప్రగల్భాలకు పోయి విమర్శలకు గురవుతూనే ఉన్నాడు. తన హయాంలో పాకిస్థాన్ సాధించిన విజయాలను చెబుతూనే.. టీమ్ఇండియాను తక్కువ చేసేలా వ్యాఖ్యలు చేశాడు.
రమీజ్ రజా క్రికెట్ బోర్డు ఛైర్మన్గా ఉన్నప్పుడు పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ 2021 సెమీఫైనల్తోపాటు 2022 టీ20 ప్రపంచకప్ ఫైనల్ వరకు వెళ్లింది. వైట్బాల్ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసిందని.. దాంతో భారత క్రికెట్లో చాలా మార్పులకు కారణమైందని పేర్కొన్నాడు. ‘‘మా జట్టు అద్భుతంగా ఆడింది. ఆసియా కప్ ఫైనల్కు చేరాం. భారత్ మాత్రం సరిగ్గా ఆడలేకపోయింది. బిలియన్ డాలర్ల సంపద కలిగిన జట్టు మా కంటే వెనుకబడింది. దీంతో చీఫ్ సెలెక్టర్, సెలెక్షన్ కమిటీతోపాటు కెప్టెన్ను కూడా తప్పించి మార్పులు చేసింది. ఇదంతా వారి కంటే పాక్ ముందుకు వెళ్లడమే కారణం. బాబర్ అజామ్ నాయకత్వంలోని పాక్ బలోపేతమైంది. జట్టును ఐక్యంగా ఉంచాం’’ అని రమీజ్ రజా తెలిపాడు. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీని వదులుకోగా.. రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది.
స్వదేశంలో ఇంగ్లాండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్ను పాక్ 3-0 తేడాతో కోల్పోవడంతో పీసీబీ ఛైర్మన్తోపాటు సెలెక్షన్ కమిటీపై పాక్ ప్రభుత్వం వేటు వేసింది. రమీజ్ రజాను తొలగించి ఆ స్థానంలో నజామ్ సేథిని పాక్ సర్కార్ నియమించింది. అలాగే ఇంజమామ్ స్థానంలో షాహిద్ అఫ్రిదిని తాత్కాలిక సెలెక్షన్ కమిటీ చీఫ్గా నియమితులయ్యాడు. కెప్టెన్ బాబర్ మీదా వేటు వేయాలనే డిమాండ్లు అక్కడ వినబడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు