పిచ్తో కాదు బ్యాటింగ్ వల్లే 2 రోజులు: కోహ్లీ
మొతేరా పిచ్ బాగానే ఉందని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. గులాబి టెస్టు రెండు రోజుల్లో ముగియడానికి రెండు జట్ల బ్యాట్స్మెన్ వైఫల్యమే కారణమని స్పష్టం చేశాడు. మరోవైపు నాణ్యమైన బౌలింగ్తో తాము ఓటమి పాలయ్యామని ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ అంగీకరించాడు....
అహ్మదాబాద్: మొతేరా పిచ్ బాగానే ఉందని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. గులాబి టెస్టు రెండు రోజుల్లో ముగియడానికి రెండు జట్ల బ్యాట్స్మెన్ వైఫల్యమే కారణమని స్పష్టం చేశాడు. మరోవైపు నాణ్యమైన బౌలింగ్తో తాము ఓటమి పాలయ్యామని ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ అంగీకరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు.
మొతేరా పిచ్ టెస్టు క్రికెట్కు సరిపోదన్న మైకేల్ వాన్, హర్భజన్ సింగ్ వంటి క్రికెటర్ల అభిప్రాయాల నేపథ్యంలో కోహ్లీ వివరణ ఇచ్చాడు. ‘నిజాయతీగా చెప్పాలంటే బ్యాటింగ్ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదు. మేం 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేశాం. అలాంటిది 150 కన్నా తక్కువకే ఆలౌటయ్యాం. ఏదో ఒక బంతి మాత్రమే అనూహ్యంగా టర్న్ అవుతోంది. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసేందుకు పిచ్ బాగానే ఉంది. 30లో 21 వికెట్లు నేరుగా విసిరిన బంతులకే పడటం విస్మయపరిచింది. మన డిఫెన్స్పై నమ్మకం ఉంచుకోవడమే టెస్టు క్రికెట్లో ప్రధానం. సరిగ్గా ఆడటకపోవడంతోనే మ్యాచ్ త్వరగా ముగిసింది’ అని కోహ్లీ అన్నాడు.
మ్యాచులో కీలకంగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్పై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘జడ్డూకు గాయమైనప్పుడు చాలామంది (ప్రత్యర్థులు) ఊపిరి పీల్చుకున్నారు. కానీ అక్షర్ పటేల్ వచ్చాడు. వేగంగా ఎత్తుమీదుగా బంతులు విసిరాడు. వికెట్ సహకరించిందంటే అక్షర్ అత్యంత ప్రమాదకరంగా మారగలడు. మనం అశ్విన్ ఘనతనూ గుర్తించాల్సి ఉంది. టెస్టు ఫార్మాట్లో ఆధునిక క్రికెట్లో అతడో దిగ్గజం. అతడు నా జట్టులో ఉండటం కెప్టెన్గా ఆనందిస్తాను’ అని విరాట్ అన్నాడు. యాష్ 77 టెస్టుల్లోనే 400 వికెట్ల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే.
టీమ్ఇండియా చేతిలో ఘోర ఓటమి క్షమార్హం కాదని ఇంగ్లాండ్ సారథి జో రూట్ అన్నాడు. తొలి ఇన్నింగ్స్లో లభించిన శుభారంభాన్ని అందిపుచ్చుకోలేదని అతడు పేర్కొన్నాడు. ‘మేం 70/2తో ఉన్నాం. కానీ దాన్ని మా జట్టు అందిపుచ్చుకోలేదు. ఈ వికెట్పై 250 పరుగులు చేసుంటే మరోలా ఉండేది. ఈ ఘోర వైఫల్యం నుంచి మేం మెరుగైన జట్టుగా పుంజుకొని తిరిగొస్తాం. బంతిపై ప్లాస్టిక్ పూత పిచ్పై వేగాన్ని అందిపుచ్చుకుంది. టీమ్ఇండియా సైతం అత్యుత్తమంగా బంతులు విసిరింది. వికెట్పై రెండు జట్లూ ఇబ్బంది పడ్డాయి. గత మ్యాచ్ ఓటమి ఒత్తిడిని మేమిక్కడికి తీసుకురాలేదు. మేం వికెట్లు తీయగలమని అనిపించింది. ఇక నేను ఐదు వికెట్లు తీశానంటే అది పిచ్ వల్లే. వందో మ్యాచ్ ఆడిన ఇషాంత్కు అభినందనలు’ అని రూట్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.