పిచ్తో కాదు బ్యాటింగ్ వల్లే 2 రోజులు: కోహ్లీ
మొతేరా పిచ్ బాగానే ఉందని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. గులాబి టెస్టు రెండు రోజుల్లో ముగియడానికి రెండు జట్ల బ్యాట్స్మెన్ వైఫల్యమే కారణమని స్పష్టం చేశాడు. మరోవైపు నాణ్యమైన బౌలింగ్తో తాము ఓటమి పాలయ్యామని ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ అంగీకరించాడు....
అహ్మదాబాద్: మొతేరా పిచ్ బాగానే ఉందని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. గులాబి టెస్టు రెండు రోజుల్లో ముగియడానికి రెండు జట్ల బ్యాట్స్మెన్ వైఫల్యమే కారణమని స్పష్టం చేశాడు. మరోవైపు నాణ్యమైన బౌలింగ్తో తాము ఓటమి పాలయ్యామని ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ అంగీకరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు.
మొతేరా పిచ్ టెస్టు క్రికెట్కు సరిపోదన్న మైకేల్ వాన్, హర్భజన్ సింగ్ వంటి క్రికెటర్ల అభిప్రాయాల నేపథ్యంలో కోహ్లీ వివరణ ఇచ్చాడు. ‘నిజాయతీగా చెప్పాలంటే బ్యాటింగ్ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదు. మేం 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేశాం. అలాంటిది 150 కన్నా తక్కువకే ఆలౌటయ్యాం. ఏదో ఒక బంతి మాత్రమే అనూహ్యంగా టర్న్ అవుతోంది. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసేందుకు పిచ్ బాగానే ఉంది. 30లో 21 వికెట్లు నేరుగా విసిరిన బంతులకే పడటం విస్మయపరిచింది. మన డిఫెన్స్పై నమ్మకం ఉంచుకోవడమే టెస్టు క్రికెట్లో ప్రధానం. సరిగ్గా ఆడటకపోవడంతోనే మ్యాచ్ త్వరగా ముగిసింది’ అని కోహ్లీ అన్నాడు.
మ్యాచులో కీలకంగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్పై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘జడ్డూకు గాయమైనప్పుడు చాలామంది (ప్రత్యర్థులు) ఊపిరి పీల్చుకున్నారు. కానీ అక్షర్ పటేల్ వచ్చాడు. వేగంగా ఎత్తుమీదుగా బంతులు విసిరాడు. వికెట్ సహకరించిందంటే అక్షర్ అత్యంత ప్రమాదకరంగా మారగలడు. మనం అశ్విన్ ఘనతనూ గుర్తించాల్సి ఉంది. టెస్టు ఫార్మాట్లో ఆధునిక క్రికెట్లో అతడో దిగ్గజం. అతడు నా జట్టులో ఉండటం కెప్టెన్గా ఆనందిస్తాను’ అని విరాట్ అన్నాడు. యాష్ 77 టెస్టుల్లోనే 400 వికెట్ల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే.
టీమ్ఇండియా చేతిలో ఘోర ఓటమి క్షమార్హం కాదని ఇంగ్లాండ్ సారథి జో రూట్ అన్నాడు. తొలి ఇన్నింగ్స్లో లభించిన శుభారంభాన్ని అందిపుచ్చుకోలేదని అతడు పేర్కొన్నాడు. ‘మేం 70/2తో ఉన్నాం. కానీ దాన్ని మా జట్టు అందిపుచ్చుకోలేదు. ఈ వికెట్పై 250 పరుగులు చేసుంటే మరోలా ఉండేది. ఈ ఘోర వైఫల్యం నుంచి మేం మెరుగైన జట్టుగా పుంజుకొని తిరిగొస్తాం. బంతిపై ప్లాస్టిక్ పూత పిచ్పై వేగాన్ని అందిపుచ్చుకుంది. టీమ్ఇండియా సైతం అత్యుత్తమంగా బంతులు విసిరింది. వికెట్పై రెండు జట్లూ ఇబ్బంది పడ్డాయి. గత మ్యాచ్ ఓటమి ఒత్తిడిని మేమిక్కడికి తీసుకురాలేదు. మేం వికెట్లు తీయగలమని అనిపించింది. ఇక నేను ఐదు వికెట్లు తీశానంటే అది పిచ్ వల్లే. వందో మ్యాచ్ ఆడిన ఇషాంత్కు అభినందనలు’ అని రూట్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్