PCB: 3-0తో పాక్ ఓటమి... క్రికెట్ బోర్డు ఛైర్మన్పై వేటు..!
పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా(Ramiz Raja)పై పాక్ ప్రధాని వేటు వేశారు. అతడిని పదవి నుంచి తొలగిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రజా(Ramiz Raja)పై ప్రభుత్వం వేటు వేసింది. అతడిని పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించింది. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిని మంత్రి వర్గం ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ను 3-0 తేడాతో కోల్పోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. రజా(Ramiz Raja) స్థానంలోని నజమ్ సేథీ అధ్యక్షుడిగా 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే నాలుగు నెలలు సేథీ ఈ పదవిలో కొనసాగనున్నారు.
అంతేకాదు.. 2019లో చేసిన పీసీబీ రాజ్యాంగాన్ని కూడా రద్దు చేశారు. 2014లో రద్దు చేసిన రాజ్యాంగాన్ని మళ్లీ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. కొత్త కమిటీలో షాహిద్ అఫ్రిది, హరూన్ రషీద్, మహిళా క్రికెటర్ సనా మిర్ కూడా స్థానాలు దక్కించుకున్నారు.
రజా(Ramiz Raja) గత 15 నెలలుగా పీసీబీ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయనను ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ ప్రభుత్వం 2021 సెప్టెంబర్లో నియమించింది. ఇషాన్ మణీ నుంచి రజా(Ramiz Raja) ఈ బాధ్యతలను స్వీకరించారు. ఇక కొత్తగా నియమితులైన సేథీ కూడా 2013-18 వరకు పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్, సీఈవోగా పనిచేశారు. తాజా పరిణామాలపై పాక్ ప్రభుత్వం, పీసీబీ, రజా(Ramiz Raja) ఇప్పటి వరకు స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.