IND vs AUS: అక్షర్ X కుల్దీప్.. నేను మాత్రం అలా చేయను: రవిశాస్త్రి
నాలుగు టెస్టుల్లోనూ (IND vs AUS) రిజర్వ్ బెంచ్కే పరిమితమైన టీమ్ఇండియా బౌలర్లలో సీనియర్ కుల్దీప్ యాదవ్ ఒకడు. అతడి స్థానంలో అక్షర్ పటేల్కు అవకాశం దక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్కు (IND vs AUS) ఎంపికైన చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాతోపాటు మూడో స్పిన్నర్గా అక్షర్ పటేల్ను ఫైనల్ XIలోకి టీమ్ఇండియా తీసుకుంది. దీంతో కుల్దీప్ రిజర్వ్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే బౌలర్గా అక్షర్ పటేల్ పెద్దగా రాణించకపోయినా.. బ్యాటింగ్లో కీలక ఇన్నింగ్స్లు ఆడటంతో విమర్శల నుంచి తప్పించుకోగలిగాడు. కానీ, అక్షర్ - కుల్దీప్ స్థానాలపై చర్చ మాత్రం కొనసాగుతోంది. దీనిపై కామెంట్రీ బాక్స్లో ఉన్న టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రిని సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ ప్రశ్నించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
‘‘అక్షర్ పటేల్ (Axar Patel) బ్యాటింగ్ చేయకుండా ఉంటే ఈ సిరీస్లో అతడి పరిస్థితి భిన్నంగా ఉండేది. అప్పుడు నేను కుల్దీప్ వైపు మొగ్గు చూపేవాడిని. అయితే, బ్యాటింగ్లో రాణించిన అక్షర్ను తప్పించాలని నేనూ అనుకోను. క్లిష్టమైన పిచ్ల మీద ఆడేటప్పుడు తమ బ్యాటింగ్ విభాగం బలంగా ఉండాలని టీమ్ఇండియా భావించింది. అందుకే ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లతో బరిలోకి దిగింది. అదేవిధంగా ఫలితం కూడా రాబట్టింది. లేకపోతే తొలి రెండు టెస్టుల్లో గెలిచి 2-0 ఆధిక్యంలోకి వెళ్లేదే కాదు. అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్తో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తొలి మూడు టెస్టుల్లో అతడు బౌలింగ్లో కీలకంగా మారలేదు. బంతి ఎక్కువగా తిరగడంతో తొలి మూడు టెస్టుల్లో ఎక్కువగా జడేజా, అశ్విన్తోనే రోహిత్ బౌలింగ్ వేయించాడు. కానీ, అహ్మదాబాద్ టెస్టులో మాత్రం అక్షర్ కీలకమవుతాడని అనిపిస్తోంది’’ అని రవిశాస్త్రి తెలిపాడు. ఆసీస్తో జరుగుతున్న నాలుగో టెస్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో అక్షర్ పటేల్ 28 ఓవర్లు వేసి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. కానీ, అదే కీలకమైన వికెట్ కావడం విశేషం. సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఎల్బీ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.