Jadeja Or Ashwin: జడేజా లేదా అశ్విన్.. గావస్కర్ ఛాయిస్ ఎవరంటే..!
డబ్ల్యూటీసీ ఫైనల్స్కు ఇంకా 48 గంటలు మాత్రమే సమయం ఉండటంతో జట్టు ఎంపికపై అభిమానులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్లు ఇప్పటికే తుది జట్టు ఎంపికపై అంచనాలు వెల్లడించారు.
ఇంటర్నెట్డెస్క్: డబ్ల్యూటీసీ (ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్) ఫైనల్స్కు కేవలం 48 గంటలు మాత్రమే ఉండటంతో తుది జట్టు ఎంపికపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సరైన జట్టుతో బరిలోకి దిగితే భారత్ జట్టు కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న ఐసీసీ ట్రోఫీ కరవును ఇది తీర్చేస్తుంది. దీంతోపాటు రోహిత్ కెప్టెన్సీలో ఓ చిరస్మరణీయ విజయం నమోదవుతుంది. ఓవల్ పిచ్ సీమర్లకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతుండటంతో భారత్ తుది జట్టులో ఒకే స్పిన్నర్కు అవకాశం లభించవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆల్రౌండర్లు జడేజా (Ravindra Jadeja), అశ్విన్ (Ravichandran Ashwin) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిద్దరూ భారత్లో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో అద్భుతంగా రాణించారు. దీంతో వీరిలో నుంచి ఒకరికి మాత్రమే స్థానం లభించే అవకాశం ఉంటే మాత్రం.. ఎంపిక టీమ్ఇండియా యాజమాన్యానికి కత్తిమీద సాములా మారనుంది. మరో వైపు కీపర్ స్థానం కోసం భరత్, ఇషాన్ మధ్య కూడా తీవ్రమైన పోటీ నెలకొంది.
ఈ నేపథ్యంలో లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్(Sunil Gavaskar) డబ్ల్యూటీసీ (World Test Championship) ఫైనల్స్ కోసం తన డ్రీమ్ టీమ్ ఇండియా జట్టును వెల్లడించాడు. దీనిలో చాలా ఆశ్చర్యకరమైన ఎంపికలు కూడా ఉన్నాయి. తుదిజట్టులో కీపర్గా కేఎస్ భరత్ను ఎంపిక చేసేందుకు ఆయన మొగ్గు చూపాడు. దీంతో పాటు ఓవల్ పిచ్పై తాను ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతానని వెల్లడించాడు. ‘‘నేను బ్యాటింగ్ విభాగంలో రోహిత్, గిల్, పుజారా, విరాట్, రహానెను ఎంచుకొంటాను. ఇక ఆరో స్థానంలో భరత్, కిషన్ మధ్య పోటీ ఉంది. ఇప్పటి వరకు భరత్ కుదురుగా ఆడటంతో.. అతడి వైపు మొగ్గుచూపుతాను. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్కు వస్తే ఎండ ఎక్కువగా ఉంటే.. అశ్విన్, జడేజాను తీసుకొంటాను. ఇక పేస్ విభాగంలో షమీ, సిరాజ్, శార్ధూల్ ఉంటారు’’ అని పేర్కొన్నారు.
ఇప్పటికే ఆఫ్ స్పిన్ టర్బోనేటర్ హర్బజన్ సింగ్ కూడా ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్ల ఎంపికకే ఓటేశాడు. అతడు అంచనావేసిన తుదిజట్టులో కూడా కేఎస్ భరత్కు స్థానం కల్పించాడు. మొత్తం మీద టీమ్ ఇండియా ఎంపికలో స్పిన్నర్లు, కీపరే కీలకం కానున్నారు. ప్రధాన బ్యాటింగ్ లైనప్లో అనుకోని ఘటనలు లేకపోతే ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!