Ricky ponting: భారత టీ20 లీగ్ వేలం.. గ్రీన్ను కొనుగోలు చేయనున్న దిల్లీ?
రానున్న భారత టీ20 లీగ్ వేలంలో ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్పై ఆసక్తి చూపుతున్నట్టుగా దిల్లీ జట్టు కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు.
దిల్లీ: ఆస్ట్రేలియా యువ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్కు భారత టీ20 లీగ్లో భారీగా డిమాండ్ వచ్చే అవకాశముంది. తాజాగా దిల్లీ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని చెప్తున్నాయి. వచ్చే సీజన్లో గ్రీన్ను కొనుగోలు చేసేందుకు తాము భారీ సొమ్మును ఏర్పాటు చేసుకున్నట్లుగా రికీ తెలిపాడు. బుధవారం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు.
‘‘వచ్చే ఏడాది భారత టీ20 లీగ్ నేపథ్యంలో నేను కామెరూన్ గ్రీన్ గురించి మాట్లాడటానికి ఆసక్తిగా ఉన్నాను. ఎందుకంటే ఈ వేలం కోసం మేం భారీ మొత్తాన్నే మిగుల్చుకున్నాం’’ అంటూ తెలిపాడు. ఇప్పటికే గ్రీన్ ఈ టీ20 లీగ్ వేలంలో తన పేరును నమోదు చేసుకొన్నాడు. ఈ టోర్నమెంట్ తన భవిష్యత్తుకు మరింత మంచి బాటలు వేస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. అదే సమయంలో ఈ ఆటగాడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో డేవిడ్ వార్నర్ స్థానంలో ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ యువ బ్యాటర్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. బౌలింగ్లోనూ రాణించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. మూడు మ్యాచ్ల్లో రెండు అర్ధశతకాలు సాధించాడు. తొలి టీ20లో భారత్ నిర్దేశించిన 209 భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. రిషభ్ పంత్ నేతృత్వంలోని దిల్లీ జట్టు ఈ సారి ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్తో పాటుగా టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బర్, శ్రీకర్ భరత్, మన్దీప్ సింగ్ను వదిలేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.