Rishabh Pant: రోడ్డు ప్రమాదం.. క్రికెటర్ రిషభ్ పంత్కు తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్కు తీవ్ర గాయాలయ్యాయి. దిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా అతడు ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
రూర్కీ: టీమ్ఇండియా క్రికెటర్ పంత్ (Rishabh Pant) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. దిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడగా.. అతడిని ఆసుపత్రికి తరలించారు.
ఘటన జరిగిన సమయంలో తన మెర్సిడెస్ కారును పంతే (Pant) నడిపాడు. మంటలు చెలరేగగానే అతడు కారు విండో పగలగొట్టుకుని బయటకు దూకేశాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో పంత్ తల, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం కాలిపోయింది. కాలికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం తర్వాత పంత్ను రూర్కీలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని దేహ్రాదూన్లో మ్యాక్స్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
ఇంట్లో వారికి సర్ప్రైజ్ ఇద్దామనుకొని..
పంత్ ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే.. పంత్ వస్తున్న విషయం ఆ ఇంట్లో ఎవరికీ తెలియదట. సర్ప్రైజ్ ఇద్దామనుకొని.. తను వస్తున్నట్లు పంత్ ఎవరికీ చెప్పలేదని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే అతడి కుటుంభసభ్యులు ఆస్పత్రికి బయలు దేరారు.
త్వరగా కోలుకో ఛాంప్..
ఘటనపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘భగవంతుడి దయ వల్ల ప్రమాదం నుంచి అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. గెట్ వెల్ సూన్ ఛాంప్’ అని లక్ష్మణ్ ట్వీట్ చేశారు. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కూడా స్పందిస్తూ.. పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు అతడి అభిమానులు కూడా పంత్ త్వరగా కోలుకోవాలని ట్వీట్లు పెడుతున్నారు. పంత్ ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని సచిన్ తెందూల్కర్, వసీమ్ అక్రమ్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ట్విటర్ వేదికగా పోస్టులు పెట్టారు.
ఇటీవల బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్లో పంత్ ఆడిన విషయం తెలిసిందే. శ్రీలంకతో టీ20 సిరీస్కు అతడిని ఎంపిక చేయలేదు. ఇక క్రిస్మస్ వేడుకలను పంత్.. మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి దుబాయ్లో చేసుకున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.