Rishabh Pant: పంత్, ఆమ్రె, శార్దూల్ ఠాకూర్లకు భారీ జరిమానా
టీ20 లీగ్లో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్, ఆ జట్టు ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్, సహాయక కోచ్ ప్రవీణ్ ఆమ్రెలకు టోర్నీ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు...
(Photos: Rishabh Pant, Shardul Thakur Instagrams)
ఇంటర్నెట్డెస్క్: టీ20 లీగ్లో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్, ఆ జట్టు ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్, సహాయక కోచ్ ప్రవీణ్ ఆమ్రెలకు టోర్నీ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. గతరాత్రి రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో నోబాల్ వివాదం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ ముగ్గురు ప్రవర్తించిన తీరు లెవెల్-2 కింద నిబంధనలు అతిక్రమించారని పేర్కొంటూ నిర్వహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఈ ముగ్గురి మ్యాచ్ ఫీజులో భారీ కోత విధిస్తున్నట్లు కూడా వెల్లడించారు.
రాజస్థాన్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ వేసిన మ్యాచ్ ఆఖరి ఓవర్ మూడో బంతిని దిల్లీ బ్యాట్స్మన్ రోమన్ పావెల్ (36) సిక్సర్గా మలిచాడు. ఆ బంతి నో బాల్గా అనిపించడంతో దిల్లీ ఆటగాళ్లు దాన్ని పరిశీలించాలని అంపైర్లను కోరారు. అయితే, దానికి వారు అంగీకరించకపోవడంతో అసహనానికి గురైన పంత్.. తమ ఆటగాళ్లను మైదానం వీడి రావాలని సూచించాడు. అలాగే శార్దూల్ కూడా అలాంటి సైగలే చేశాడు. దీంతో పాటు వారిద్దరూ డగౌట్లోనే పక్కనే ఉన్న మరో అంపైర్తోనూ వాదనకు దిగారు. ఆపై పంత్.. తమ సహాయక కోచ్ ఆమ్రెను మైదానంలోకి పంపించి అంపైర్లతో మాట్లాడాలని చెప్పాడు. దీంతో ఆయన మైదానంలోకి వెళ్లాడు.
ఈ నేపథ్యంలోనే ముగ్గురిపైనా చర్యలు తీసుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. పంత్ మ్యాచ్ ఫీజులో 100శాతం, శార్దూల్ ఫీజులో 50 శాతం కోత విధించగా అసిస్టెంట్ కోచ్ ఆమ్రెకు 100 శాతం ఫీజ్ కోతతో పాటు ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించారు. కాగా, వీరు తమ నేరాన్ని అంగీకరించినట్లు కూడా అందులో వివరించారు. దిల్లీ ఈ ఓటమితో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన ఏడు మ్యాచ్ల్లో మూడు విజయాలు, నాలుగు ఓటములు చవిచూసింది. ఇక తర్వాత మ్యాచ్ ఈ నెల 28న కోల్కతాతో ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.