Rohit: భారీ స్కోరు బాకీ ఉందని తెలుసు.. కానీ నాకు కంగారేమీ లేదు: రోహిత్
న్యూజిలాండ్పై మూడు వన్డేల సిరీస్ను (IND vs NZ 2023) టీమ్ఇండియా (Team India) మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకొంది. తక్కువ స్కోర్లు నమోదైన రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఇప్పటి వరకు మూడంకెల స్కోరును సాధించలేదనే వ్యాఖ్యలపై రోహిత్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడతాడు. అయితే వన్డేల్లో సెంచరీ కొట్టి దాదాపు రెండేళ్లవుతోంది. కీలక ఇన్నింగ్స్లు ఆడినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. తాజాగా న్యూజిలాండ్పై అర్ధశతకం సాధించాడు. గత కొంతకాలంగా మూడంకెల స్కోరు సాధించకపోవడంపై రోహిత్ శర్మ స్పందించాడు.
‘‘ఇప్పుడు నేను నా గేమ్ను మార్చుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా. బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తున్నా. ఒత్తిడి తేవడం చాలా ముఖ్యమనేది నా భావన. ఇక గత కొంతకాలంగా భారీ స్కోర్లు చేయలేదనే విషయం నాకూ తెలుసు. అయితే దాని గురించి పెద్దగా కంగారేమీ లేదు. ఇప్పుడు నా బ్యాటింగ్తో ఆనందంగానే ఉన్నా. అయితే నా బ్యాటింగ్ అప్రోచ్ను మాత్రం నాతోనే ఉంచుకున్నా. భారీ స్కోరు బాకీ ఉందని నాకు తెలుసు’’ అని అన్నాడు.
రెండో వన్డేలో కివీస్ను కుప్పకూల్చిన బౌలర్లను రోహిత్ అభినందించాడు. ‘‘గత ఐదు మ్యాచ్లను పరిశీలిస్తే.. భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. మనం ఎలాంటి ఫలితం కావాలని అడిగామో.. అలాంటి డెలివరీలనే బౌలర్లు సంధించారు. భారత్ వేదికగా సూపర్ బౌలింగ్ చేశారు. విదేశాల్లోనూ ఇదే ప్రదర్శనను ఆశిస్తున్నారు. అయితే భారత బౌలర్లు ఉత్తమ నైపుణ్యం కలిగిన ఆటగాళ్లే. కివీస్తో రెండో వన్డేలో మావాళ్లు అదరగొట్టారు. ఈ పిచ్పై 250 పరుగులైనా ఛేదించగలమని భావించాం. బౌలర్లు చక్కగా బౌలింగ్ చేసి కివీస్ను కుప్పకూల్చారు. షమీ, సిరాజ్ లాంగ్ స్పెల్ వేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే వారికి ముందు టెస్టు సిరీస్ (ఆసీస్తో) ఉందని గుర్తు చేశా. అందుకే పూర్తి ఓవర్లపాటు బౌలింగ్ వేయించలేదు’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్పై వన్డే సిరీస్ను భారత్ సొంతం చేసుకుంది. తొలుత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో కివీస్ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ (51)తోపాటు శుభ్మన్ గిల్ (40*) రాణించాడు. దీంతో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి వన్డే మ్యాచ్ ఇందౌర్ వేదికగా మంగళవారం జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే