IND vs SA : దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. టీమ్ఇండియాలోజోష్ కనిపించలేదు: భట్
అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన విరాట్ కోహ్లీ ఐదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో బ్యాటర్గా తొలి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో విరాట్ అర్ధశతకం సాధించినా భారత్కు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో కోహ్లీతోపాటు జట్టు ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ సారథి సల్మాన్ భట్
ఇంటర్నెట్ డెస్క్: అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన విరాట్ కోహ్లీ ఐదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో బ్యాటర్గా తొలి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో విరాట్ అర్ధశతకం సాధించినా భారత్కు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో కోహ్లీతోపాటు జట్టు ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ సారథి సల్మాన్ భట్ తనదైన శైలిలో విశ్లేషించాడు. కెప్టెన్గా కోహ్లీ అందించే ఎనర్జీ.. మొదటి వన్డేలో మిస్ అయిందన్నాడు. భారత క్రికెట్ జట్టులో మార్పులు, కోహ్లీ సారథ్యానికి వీడ్కోలుపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వైద్య పరిభాషలో ఛలోక్తి విసిరాడు. ‘‘వ్యక్తికి ఆరోగ్యం బాగున్నా సరే మందులు ఇచ్చేందుకు కొంతమంది వైద్యులు ఆసక్తి చూపుతుంటారు. కాబట్టి డాక్టర్ (బీసీసీఐ) వస్తున్నాడంటే మెడిసిన్ వస్తుందని గ్రహించాలి. ఎలాంటి కారణం లేకుండానే దురదృష్టవశాత్తూ పలు సంఘటనలు జరిగిపోతుంటాయి’’ అని పేర్కొన్నాడు.
‘‘ విరాట్ కెప్టెన్గా ఉన్నప్పుడు వచ్చే ఉత్సాహం, ఎనర్జీ దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో కనిపించలేదు. ఇది కొంతమంది వల్లే జరుగుతుంది. వారు సారథిగా ఉన్నప్పుడు ఆ జోష్ వేరేగా ఉంటుంది. అయితే కెప్టెన్గా ఉన్న ఆటగాడి నుంచి మొదటి వన్డేలో ఆ దూకుడు కనిపించలేదు. దాని కోసం ప్రయత్నించాలి. కేఎల్ రాహుల్లో చూడలేకపోయా. అంతేకాకుండా తర్వాతి మ్యాచ్లో గెలవాలంటే కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్ స్థానానికి రావడమే సత్వర పరిష్కారం. ఇంకో బ్యాటర్ను అదనంగా జట్టులోకి తీసుకోవాలి. అలానే భువనేశ్వర్ బదులు మంచి ఫాస్ట్ బౌలర్ను ఎంచుకోవాలి. సరైన బ్యాటర్ను ఓపెనింగ్కు పంపితే ప్రత్యర్థి మీద ఒత్తిడి పెంచినట్లు అవుతుంది. తర్వాత మిడిలార్డర్ అనుభవం పనికొస్తుంది’’ అని భట్ విశ్లేషించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే