WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరితే.. జట్టులో రాహుల్ లేదా గిల్? డీకే సమాధానమిదే!
భారత్ - ఆస్ట్రేలియా సిరీస్లో (IND vs AUS) ఘోరంగా విఫలమైన బ్యాటర్లలో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఒకడు. ఈ క్రమంలో అతడి స్థానంపై అనుమానాలు రేకెత్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల టెస్టుల్లో ఘోర ప్రదర్శనతో విమర్శలు రావడంతో కేఎల్ రాహుల్ను (KL Rahul) తుది జట్టులో నుంచి తప్పించారు. అతడి స్థానంలో వచ్చిన యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఆసీస్తో నాలుగో టెస్టులో (IND vs AUS) సెంచరీ సాధించాడు. దీంతో గిల్ను తదుపరి మ్యాచ్లకు తప్పించడం దాదాపు కష్టమే. ఈ క్రమంలో ఒకవేళ టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్తే తుది జట్టులో ఎవరు ఉండాలన్న దానిపై చర్చకు తెరలేసింది. ఇదే విషయంపై టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ స్పందించాడు. కేఎల్ రాహుల్ను కీపర్ బ్యాకప్ ఆప్షన్గా ఉపయోగించుకోవచ్చని సూచించాడు.
‘‘టెస్టు క్రికెట్ ఇతర ఫార్మాట్లతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది. కేఎల్ రాహుల్ టెస్టుల్లో వికెట్ కీపింగ్ను ఆస్వాదించే వ్యక్తి కాదని నాకు తెలుసు. అయితే, కేఎల్ వికెట్ కీపింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటే మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడిని బ్యాకప్గా పెట్టుకోవచ్చు. యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ప్రదర్శన అద్భుతం. ఒకవేళ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకుంటే.. గిల్నే ఓపెనర్గా చూడాలని ఉంది. అతడు రేసు గుర్రంలాంటివాడు. అందుకే, పదేళ్ల తర్వాత(2033) కూడా శుభ్మన్ గిల్నే టీమ్ఇండియా తరఫున ఓపెనర్గానూ చూడాలని నేను అనుకుంటున్నాను’’ అని కార్తిక్ తెలిపాడు.
ప్రస్తుతం ఆసీస్తో టెస్టు సిరీస్లో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. తొలి మూడు టెస్టుల్లో గొప్పగా రాణించకపోయినా.. నాలుగో టెస్టులో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కీపింగ్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్ వెళ్లినా.. కేఎస్కు అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అలాంటప్పుడు కేఎల్ రాహుల్ను తుది జట్టులోకి తీసుకొనేందుకు కూడా అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. జూన్ నాటికి శ్రేయస్ సిద్ధం కాకపోతే అతడి స్థానంలో కేఎల్కు ఛాన్స్ ఇవ్వొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.