IPL 2023: భారత కెప్టెన్ల సారథ్యంలోని జట్లే 12 కప్లు నెగ్గాయి: గావస్కర్
ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) ముగింపు దశకు చేరింది. ప్లేఆఫ్స్లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. లఖ్నవూ - ముంబయి ఇండియన్స్ (LSG vs MI) జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఇరు జట్లకూ మెంటార్లుగా గంభీర్, సచిన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ కోచింగ్ సిబ్బందిపై క్రికెట్ దిగ్గజం ప్రశంసలు గుప్పించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్కు చేరింది. ఇక రెండో జట్టు తేలాలంటే శుక్రవారం వరకు వేచి చూడాలి. నేడు లఖ్నవూ సూపర్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ (LSG vs MI) జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు గుజరాత్ టైటాన్స్తో తలపడాల్సి ఉంటుంది. అప్పుడు ఆ మ్యాచ్ విజేత ఫైనల్కు వెళ్తుంది. లఖ్నవూ జట్టుకు గౌతమ్ గంభీర్ మెంటార్ కాగా.. ముంబయికి సచిన్ మెంటార్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో భారతీయ కోచింగ్ సిబ్బంది పనితీరుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కుర్రాళ్లను ముందుకు తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారని అభినందించాడు.
‘‘రింకు సింగ్ అద్భుతంగా ఆడటంలో కోల్కతా కోచ్ చంద్రకాంత్ పండిత్ కీలక పాత్ర పోషించాడు. వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించారు. కెప్టెన్గా నితీశ్ రాణా మెరుగుదల వెనుక పండితే కారణం. ఇక గౌతమ్ గంభీర్ మార్గదర్శకంలో ఆయుష్ బదోని, రవి బిష్ణోయ్, నవీనుల్ హక్ ప్లేయర్లు రాటులేదారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆశిశ్ నెహ్రా - పాండ్య నేతృత్వంలో లీగ్ స్టేజ్లో గుజరాత్ అద్భుత విజయాలను నమోదు చేసింది. విదేశీ కోచ్ల వల్ల దేశీయ ఆటగాళ్లు భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటి వరకు 15 టైటిళ్లలో 12 కప్లను భారత క్రికెటర్ల నాయకత్వంలోని జట్లే సొంతం చేసుకున్నాయి’’ అని గావస్కర్ తెలిపాడు. ఇందులో రోహిత్ సారథ్యంలో 5 సార్లు, ధోనీ కెప్టెన్సీలో 4 సార్లు, గంభీర్ నాయకత్వంలో 2, హార్దిక్ ఒకసారి విజేతగా నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.