Sunil Gavaskar: గతేడాది న్యూజిలాండ్ అలవాటుపడినట్లే.. ఇప్పుడు పుజారా..: గావస్కర్
టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో రెండు ద్విశతకాలు, రెండు శతకాలు బాదడంపై బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో రెండు ద్విశతకాలు, రెండు శతకాలు బాదడంపై బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కౌంటీ క్రికెట్ బౌలింగ్, టెస్టు క్రికెట్ బౌలింగ్ ఒకేలా ఉండవని చెప్పాడు. అయితే, టీమ్ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఆడే టెస్టు మ్యాచ్కు అతడిని ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డాడు. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా ఐదు టెస్టుల సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. కరోనా కేసుల కారణంగా చివరి టెస్టు వాయిదా పడింది. దాన్ని ఇప్పుడు జులై 1 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు.
మరోవైపు పుజారా కొంతకాలంగా టీమ్ఇండియా తరఫున విఫలమవడంతో ఇటీవల భారత టీ20 లీగ్కు ముందు స్వదేశంలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్కు ఎంపిక చేయలేదు. అయితే, అదే సమయంలో ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో పాల్గొన్న అతడు ససెక్స్ టీమ్ తరఫున అదరగొట్టాడు. దీంతో అతడు మళ్లీ టీమ్ఇండియాకు వచ్చే అవకాశాలపై గావస్కర్ స్పందించాడు. ‘ఇంగ్లాండ్తో టెస్టు మ్యాచ్కు పుజారాను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. గతేడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు న్యూజిలాండ్ ఇంగ్లాండ్లో రెండు టెస్టులు ఆడటంతో.. ఆ జట్టు అక్కడి పరిస్థితులకు అలవాటు పడింది. దాంతో ఫైనల్ మ్యాచ్లోనూ వర్షం కురవడంతో పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు పుజారా విషయంలోనూ అదే జరుగుతోంది. ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు పడ్డాడు. అయితే, కౌంటీ క్రికెట్ బౌలింగ్ అటాక్కు, టెస్టు క్రికెట్ బౌలింగ్ అటాక్కు చాలా తేడా ఉంది. కానీ, ఒక బ్యాట్స్మన్ మంచి ఫామ్లో ఉంటే ఎందుకు ఎంపిక చేయకూడదు?’ అని అభిప్రాయపడ్డాడు.
పుజారా జనవరి వరకూ టీమ్ఇండియాలో ఆడాడని, ఇప్పుడు జట్టు నుంచి తొలగించినా ఆ విరామం రెండు మూడేళ్లు ఉండదని గావస్కర్ అన్నాడు. కేవలం ఆరు, ఏడు నెలలు మాత్రమే జట్టుకు దూరమవుతాడన్నాడు. దాంతో జులైలో ఇంగ్లాండ్తో ఆడే టెస్టు మ్యాచ్కు అతడిని ఎంపిక చేయాలన్నాడు. పుజారా బ్యాటింగ్ చేసేటప్పుడు తన ఆటతో ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించడం, గోడలా నిలబడి వికెట్ కాపాడుకోవడం టీమ్ఇండియాకు ముఖ్యమని చెప్పాడు. మరోవైపు ప్రస్తుత కౌంటీ క్రికెట్లో అతడి స్ట్రైక్రేట్ కూడా బాగుందని గావస్కర్ మెచ్చుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం