Team India: రచిన్ అనే పేరు రాహుల్, సచిన్ నుంచే వచ్చిందా?
టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ దిగ్గజ ఆటగాడని, అతని నుంచి పలు విషయాలు నేర్చుకుంటానని న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్ర అన్నాడు...
ఆ విషయం నాకూ తెలియదు: న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర
(Photo: Black caps Twitter)
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ దిగ్గజ ఆటగాడని, అతడి నుంచి పలు విషయాలు నేర్చుకుంటానని న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్ర అన్నాడు. రెండో టీ20 మ్యాచ్కు ముందు మీడియాతో వర్చువల్గా మాట్లాడిన అతడు తన పేరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందూల్కర్ పేర్ల నుంచే తన పేరు పెట్టారా? అని అడిగిన ప్రశ్నకు.. ఆ విషయం తనకూ తెలియదని బదులిచ్చాడు. తన తల్లిదండ్రులను దీని గురించి ఎప్పుడూ అడగలేదని చెప్పాడు. ఈ విషయంపై స్పష్టత కావాలంటే వారినే అడగాలని సూచించాడు. రచిన్ 2016, 2018లో అండర్-19 స్థాయిలో న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలోనే అప్పట్లో టీమ్ఇండియా అండర్-19, ఇండియా ఏ జట్లతోనూ మ్యాచ్లు ఆడాడు. అదే సమయంలో యువ ఆటగాళ్లకు కోచ్గా సేవలందించిన ద్రవిడ్తో పరిచయం ఏర్పడింది. ఇక ఈ ఏడాది బంగ్లాదేశ్ పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రచిన్ తాజాగా భారత్తో జరుగుతున్న టీ20 సిరీస్లోనూ ఆడుతున్నాడు. దీంతో మరోసారి రాహుల్ ద్రవిడ్ నుంచి మరిన్ని మెళకువలు నేర్చుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘ద్రవిడ్ సర్ గొప్ప లెజెండరీ ఆటగాడు. ఆయన అండర్-19, ఇండియా ఏ జట్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో కివీస్ పర్యటనకు వచ్చారు. అప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆటలో పలు విషయాలు కూడా నేర్చుకున్నాను. ఇక ఈ సిరీస్లో ఆడుతున్నందున ద్రవిడ్తో మరోసారి కలిసే అవకాశం దక్కింది. దీంతో ఆయ నుంచి మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ద్రవిడ్తో కలిసి ప్రయాణిస్తే నా కెరీర్కు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా’ అని రచిన్ చెప్పుకొచ్చాడు. అనంతరం టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై మాట్లాడుతూ.. అతడో ప్రపంచ స్థాయి స్పిన్నర్ అని కొనియాడాడు. అశ్విన్ చాలా కాలంగా రాణిస్తున్నాడని, దీంతో అతడికి మంచి రికార్డు ఉందని యువ క్రికెటర్ గుర్తుచేశాడు. ఇప్పటివరకూ అశ్విన్తో కలిసే అవకాశం రాలేదని, కానీ.. అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా అతడి నుంచి కూడా కొత్త విషయాలు నేర్చుకుంటానని ఈ యువ స్పిన్నర్ అన్నాడు. కాగా, రచిన్ తల్లిదండ్రులది బెంగళూరు. తండ్రి పేరు రవి కృష్ణమూర్తి, తల్లి దీపా కృష్ణమూర్తి. 1990ల్లోనే వీరు న్యూజిలాండ్కెళ్లి స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే రచిన్ రవీంద్ర అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు. చివరికి క్రికెటర్గా ఎదిగి ఇప్పుడు న్యూజిలాండ్ జట్టులో ఆడుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.