IND vs AFG: రోహిత్, రాహుల్, హార్దిక్, పంత్ దంచికొట్టుడు చూస్తారా?
టీ20 ప్రపంచకప్లో తొలి రెండు మ్యాచ్ల్లో పూర్తిగా విఫలమైన టీమ్ఇండియా బ్యాట్స్మెన్ బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో బౌండరీ లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు...
బాదడమే లక్ష్యంగా.. భారత్ x అఫ్గానిస్థాన్ హైలైట్స్
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్లో తొలి రెండు మ్యాచ్ల్లో పూర్తిగా విఫలమైన టీమ్ఇండియా బ్యాట్స్మెన్ బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో బౌండరీలే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (74), కేఎల్ రాహుల్ (69) ధాటిగా ఆడి తొలి వికెట్కు 140 పరుగులు జోడించారు. తొలి వికెట్గా రోహిత్ వెనుదిరగ్గా మరో ఏడు పరుగులకే రాహుల్ సైతం పెవిలియన్ బాట పట్టాడు. ఆపై హార్దిక్ పాండ్య (35 నాటౌట్), రిషబ్ పంత్ (27 నాటౌట్) మరింత దూకుడుగా ఆడి చివరి 21 బంతుల్లో 63 పరుగులు సాధించారు. దీంతో భారత్ ఈ ప్రపంచకప్లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది. తొలి రెండు మ్యాచ్ల్లో పరుగులు చేయడానికి ఇబ్బందులు పడిన ఈ ఆటగాళ్లంతా ఈ మ్యాచ్లో ఎలాగైనా రాణించాలనే కసితో కనిపించారు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీ లైన్ దాటించారు. అనంతరం భారత బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బంతులేయడంతో అఫ్గానిస్థాన్ 147/7కే పరిమితమైంది. దీంతో భారత్ 66 పరుగల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్కు సంబంధించిన కీలక ఘట్టాల వీడియోను ఐసీసీ ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. మన బ్యాట్స్మెన్ ఎలా రెచ్చిపోయారో, బౌలర్లు ఎలా రాణించారో మీరూ చూసి ఆస్వాదించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.