Virat Kohli: అందుకోసం విరాట్ కోహ్లీ ఓపిక పట్టాలి: వీవీఎస్ లక్ష్మణ్
విరాట్ కోహ్లీ ఆటలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని, అతడు టెస్టు క్రికెట్లో తిరిగి అత్యుత్తమ ఫామ్ని అందుకోవడానికి ఓపికగా ఉండి సుదీర్ఘ ఇన్నింగ్స్ని ఆడాలని భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. చాలారోజుల నుంచి కోహ్లీ
పుజారా కూడా నిరుత్సాహానికి గురై ఉంటాడన్న మాజీ బ్యాటర్
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ ఆటలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని, అతడు టెస్టు క్రికెట్లో తిరిగి అత్యుత్తమ ఫామ్ని అందుకోవడానికి ఓపికగా ఉండి సుదీర్ఘ ఇన్నింగ్స్ని ఆడాలని భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. చాలారోజుల నుంచి కోహ్లీ మూడంకెల స్కోరును చేయకుండానే ఔట్ అవుతున్నాడని, శతకం కరవుని తీర్చుకోవడానికి అతడు ఓపిక పట్టాలని లక్ష్మణ్ పేర్కొన్నారు. త్వరలో విరాట్ శతకం బాదుతాడని, ఒక్కసారి సెంచరీ చేస్తే మునుపటిరీతిలో భారీగా పరుగులు చేస్తాడని లక్ష్మణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్లో 36పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
కివీస్తో ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో వచ్చిన శుభారంభాన్ని భారీ స్కోరుగా మలుచుకోవడంలో ఛెతేశ్వర్ పుజారా విఫలమయ్యాడు. ఓపెనర్గా వచ్చి 47 పరుగులు చేసి ఔటయ్యాడు. దీనిపై వీవీఎస్ స్పందిస్తూ.. ‘‘టెస్టుల్లో పుజారా శతకం చేసి చాలా రోజులైంది. ఈ క్రమంలో మంచి అవకాశం మిస్ అయింది. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే పుజారా... ఈసారి ఓపెనింగ్కు దిగాడు. అయితే ఎంతో కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 47 పరుగులు వద్ద ఔట్ కావడం నిజంగా పుజారాను నిరుత్సాహానికి గురి చేసే ఉంటుంది. సెంచరీ చేయాలనే ఒత్తిడి మరికొన్ని రోజులు తప్పదు’’ అని పేర్కొన్నాడు.
ఇక, రెండో టెస్టు విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 325 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (150) శతకంతో రాణించాడు.న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ 10 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. భారత బౌలర్లు చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 276/7 వద్ద డిక్లేర్ చేసి కివీస్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మ్యాచ్లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. కివీస్ విజయం సాధించాలంటే మరో 400 పరుగులు చేయాలి. మరో ఐదు వికెట్లు పడగొడితే టీమ్ఇండియా విజయం సాధించి సిరీస్ని 1-0తో కైవసం చేసుకుంటుంది.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే