Virat Kohli: అందుకోసం విరాట్ కోహ్లీ ఓపిక పట్టాలి: వీవీఎస్ లక్ష్మణ్
విరాట్ కోహ్లీ ఆటలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని, అతడు టెస్టు క్రికెట్లో తిరిగి అత్యుత్తమ ఫామ్ని అందుకోవడానికి ఓపికగా ఉండి సుదీర్ఘ ఇన్నింగ్స్ని ఆడాలని భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. చాలారోజుల నుంచి కోహ్లీ
పుజారా కూడా నిరుత్సాహానికి గురై ఉంటాడన్న మాజీ బ్యాటర్
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ ఆటలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని, అతడు టెస్టు క్రికెట్లో తిరిగి అత్యుత్తమ ఫామ్ని అందుకోవడానికి ఓపికగా ఉండి సుదీర్ఘ ఇన్నింగ్స్ని ఆడాలని భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. చాలారోజుల నుంచి కోహ్లీ మూడంకెల స్కోరును చేయకుండానే ఔట్ అవుతున్నాడని, శతకం కరవుని తీర్చుకోవడానికి అతడు ఓపిక పట్టాలని లక్ష్మణ్ పేర్కొన్నారు. త్వరలో విరాట్ శతకం బాదుతాడని, ఒక్కసారి సెంచరీ చేస్తే మునుపటిరీతిలో భారీగా పరుగులు చేస్తాడని లక్ష్మణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్లో 36పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
కివీస్తో ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో వచ్చిన శుభారంభాన్ని భారీ స్కోరుగా మలుచుకోవడంలో ఛెతేశ్వర్ పుజారా విఫలమయ్యాడు. ఓపెనర్గా వచ్చి 47 పరుగులు చేసి ఔటయ్యాడు. దీనిపై వీవీఎస్ స్పందిస్తూ.. ‘‘టెస్టుల్లో పుజారా శతకం చేసి చాలా రోజులైంది. ఈ క్రమంలో మంచి అవకాశం మిస్ అయింది. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే పుజారా... ఈసారి ఓపెనింగ్కు దిగాడు. అయితే ఎంతో కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 47 పరుగులు వద్ద ఔట్ కావడం నిజంగా పుజారాను నిరుత్సాహానికి గురి చేసే ఉంటుంది. సెంచరీ చేయాలనే ఒత్తిడి మరికొన్ని రోజులు తప్పదు’’ అని పేర్కొన్నాడు.
ఇక, రెండో టెస్టు విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 325 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (150) శతకంతో రాణించాడు.న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ 10 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. భారత బౌలర్లు చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 276/7 వద్ద డిక్లేర్ చేసి కివీస్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మ్యాచ్లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. కివీస్ విజయం సాధించాలంటే మరో 400 పరుగులు చేయాలి. మరో ఐదు వికెట్లు పడగొడితే టీమ్ఇండియా విజయం సాధించి సిరీస్ని 1-0తో కైవసం చేసుకుంటుంది.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..