Virender Sehwag: అప్పుడు వాళ్లను వీర బాదుడు బాదుతాను అన్నాను.. కానీ : సెహ్వాగ్
తొలి ఐపీఎల్(IPL) నాటి సంగతులను వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) గుర్తుచేసుకున్నాడు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో వివరించాడు.
ఇంటర్నెట్డెస్క్ : ప్రపంచంలో ఎక్కడా లేని క్రేజ్ మన ఐపీఎల్(IPL)కే ఉంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ ప్లేయర్లు ఇందులో ఆడేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ప్రతీ సీజన్కు ఎంతో ఆదరణను పెంచుకుంటూ వస్తోన్న ఈ టోర్నీ.. టీమ్ఇండియా(TeamIndia)లోనే కాకుండా ప్రపంచ క్రికెట్లోనూ ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. అయితే.. ఈ టోర్నీ ప్రారంభమైనప్పుడు ఇంత ఆదరణ వస్తుందని ఎవరూ ఊహించలేదు. తొలి ఐపీఎల్ ఆడిన సమయంలో తన అనుభవాలను మాజీ డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్(Virender Sehwag) తాజాగా ఓ క్రీడా ఛానల్తో పంచుకున్నాడు.
‘‘ఐపీఎల్కు ముందు మేమంతా టీమ్ఇండియా కోసం ఆడేవాళ్లం. అయితే ఈ టోర్నీ ప్రారంభమయ్యాక.. ఆటగాళ్లు విడిపోయి ఆయా జట్లకు ఆడేవారు. నా జట్టులో కొంత మంది ఆడితే.. మరికొంతమంది వేరే జట్లకు ఆడేవారు. ముఖ్యంగా చెప్పాలంటే.. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, హర్భజన్ నాకు క్లోజ్ ఫ్రెండ్స్. ‘నెట్స్లో ఎంతో ప్రాక్టీస్ చేశావు కదా.. ఐపీఎల్లో మ్యాచ్కు రా.. నిన్ను వీర బాదుడు బాదుతా’ అని నేను వారితో సరదాగా అనే వాడిని’’ అని సెహ్వాగ్ చెప్పాడు.
అయితే ఐపీఎల్లో అలాంటిదేమి జరగలేదని సెహ్వాగ్ వివరించాడు. ‘జహీర్ ఖాన్ నన్ను ఔట్ చేశాడు. నెహ్రా, హర్భజన్ కూడా నా వికెట్ తీశారు. అయితే.. నేను వారిపై మంచి ఇన్నింగ్సే ఆడాను. ఐపీఎల్ వచ్చాక పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. సొంత జట్టు సభ్యులపైనే ఆడాల్సి వచ్చింది’ అని తెలిపాడు.
ఇక ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ.. దిల్లీలో దిల్లీ జట్టుకు మద్దతిచ్చే బదులు.. అభిమానులు సచిన్, ద్రవిడ్, గంగూలీ, ధోనీల కోసం కేకలు వేసేవారని అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు ఈ మాజీ డ్యాషింగ్ ఓపెనర్.
ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్ జరుగుతోంది. కరోనా పరిస్థితుల తర్వాత.. తొలిసారి ప్రేక్షకుల మధ్య హోం గ్రౌండ్స్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. గతేడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్లోనే సీఎస్కేను మట్టికరిపించి బోణీ కొట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.