‘అమర్‌రాజా’పై మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు

అమర్‌రాజా పరిశ్రమ మూసివేతకు పీసీబీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం మరోసారి పొడిగించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

Published : 08 Dec 2021 05:45 IST

ఈనాడు, అమరావతి: అమర్‌రాజా పరిశ్రమ మూసివేతకు పీసీబీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం మరోసారి పొడిగించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ పరిశ్రమలో ఉద్యోగుల రక్తంలో సీసం(లెడ్‌) శాతంపై వైద్య పరీక్ష నిర్వహించిన సంస్థ ఇచ్చిన నివేదికను హైకోర్టుకు సమర్పించకుండా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పరిశ్రమ తరఫు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నివేదిక అందినా ఇంకా రాలేదని కోర్టుకు చెబుతున్నారన్నారు. ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని కోరారు. పీసీబీ తరఫు న్యాయవాది సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సభ్య కార్యదర్శికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు. ఇరువైపులా వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ నెల 8నాటికి అఫిడవిట్‌ దాఖలు చేయాలని అమర్‌రాజా పరిశ్రమను ఆదేశించింది. 17లోపు కౌంటర్‌ వేయాలని పీసీబీకి స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని