Rohit Sharma: ఇదే మా అసలైన సామర్థ్యం..ఇది నా బర్త్డే గిఫ్ట్:రోహిత్
ముంబయి టీమ్ 15వ సీజన్లో ఎట్టకేలకు తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. వరస పరాజయాలతో సతమతమవుతున్న ఆ జట్టు గతరాత్రి టాప్-2లో కొనసాగుతున్న రాజస్థాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది...
ముంబయి: ముంబయి టీమ్ 15వ సీజన్లో ఎట్టకేలకు తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆ జట్టు గతరాత్రి టాప్-2లో కొనసాగుతున్న రాజస్థాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ తమ ఆటగాళ్ల ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశాడు. ఇదే తమ అసలైన సామర్థ్యం అని సంబరపడ్డాడు. ఈ విజయాన్ని కచ్చితంగా తన పుట్టిన రోజు కానుకగా స్వీకరిస్తానని చెప్పాడు.
‘రాజస్థాన్ను ఆ మాత్రం స్కోరుకు కట్టడి చేయడం కష్టమని మాకు తెలుసు. అయితే, వాళ్లు మాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. వాళ్లకున్న బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో.. వికెట్లు పడగొడితే ఆ జట్టుకు కూడా కష్టమని మేం భావించాం. అందుకు తగ్గట్టే బౌలింగ్ చేయాలనుకున్నాం. దాన్ని ఈ మ్యాచ్లో కచ్చితంగా అమలుచేశాం’ అని రోహిత్ పేర్కొన్నాడు. అనంతరం తమ యువ బౌలర్లు షాకీన్, కార్తీకేయల గురించి మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ చాలా ధైర్యవంతులని పేర్కొన్నాడు. వాళ్లతో మాట్లాడినప్పుడు జట్టు కోసం ఏదో చేయాలనే తాపత్రయం వాళ్లలో కనిపించిందని వెల్లడించాడు. దీంతో వాళ్లకు బౌలింగ్ ఇవ్వడానికి తనకు నమ్మకం కలిగిందన్నాడు.
‘బట్లర్కు బౌలింగ్ చేయడానికి షాకీన్కు బంతి ఇవ్వడం నిజంగా సాహసోపేతమైన నిర్ణయం. అతడి బౌలింగ్లో బట్లర్ పలు సిక్సర్లు సాధించినా.. చివరికి తన బౌలింగ్లోనే ఔటయ్యాడు. దీంతో రాజస్థాన్ను 10-15 పరుగుల తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగాం. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్లో మా ప్రదర్శన చాలా గొప్పగా ఉంది. బౌలర్లు సమష్టిగా రాణిస్తే బ్యాట్స్మన్ తమ పని పూర్తి చేశారు’ అని ముంబయి కెప్టెన్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 158/6 స్కోర్ సాధించగా.. ముంబయి 5 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ (51), తిలక్ వర్మ (35) రాణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం