Virat Kohli: డివిలియర్స్ను గుర్తు చేసుకుంటూ విరాట్ కోహ్లీ భావోద్వేగం.. ఏం చెప్పాడో చూడండి!
బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ, ఆ జట్టు మాజీ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ మంచి స్నేహితులనే సంగతి అందరికీ తెలిసిందే. 11 ఏళ్లుగా ఆ ఫ్రాంఛైజీ తరఫున ఆడిన...
ఈసారి కప్పుగెలిస్తే.. ఏబీనే గుర్తుచేసుకుంటా: కోహ్లీ
ఇంటర్నెట్డెస్క్: బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ, ఆ జట్టు మాజీ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ మంచి స్నేహితులనే సంగతి అందరికీ తెలిసిందే. 11 ఏళ్లుగా ఆ ఫ్రాంఛైజీ తరఫున ఆడిన ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఎప్పుడూ సోదరుల్లా కలిసి మెలిసి తిరుగుతారు. అయితే, డివిలియర్స్ గతేడాది నవంబర్లో ఆటకు పూర్తిగా వీడ్కోలు పలకడంతో ఈసారి మెగా టోర్నీలో ఆడలేకపోతున్నాడు. అతడు లేకపోవడం ఎలా అనిపిస్తోందని కోహ్లీని అడగ్గా భావోద్వేగం చెందాడు. ఈసారి బెంగళూరు కప్పు గెలిస్తే తాను ఏబీని గుర్తుచేసుకుంటానని చెప్పాడు.
‘డివిలియర్స్ లేకపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అతడు ఆటకు వీడ్కోలు పలికిన రోజు నాకింకా గుర్తుంది. టీ20 ప్రపంచకప్ తర్వాత మేం దుబాయ్ నుంచి భారత్కు తిరిగి వచ్చేటప్పుడు నాకొక వాయిస్ నోట్ పెట్టాడు. అయితే, డివిలియర్స్ ఈ నిర్ణయం తీసుకుంటాడనే సందేహం నాకు గత సీజన్లోనే అనిపించింది. అప్పుడు నాతో మాట్లాడుతూ ‘‘నీతో కలిసి కాఫీ తాగాలి. చాలా మాట్లాడాలి’’ అని చెప్పేవాడు. నాకు ఏదోలా అనిపించి నేను కాఫీకి రానని చెప్పేశా. అప్పుడే తన విషయంలో ఏదో జరుగుతుందని గ్రహించా’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
అలాగే డివిలియర్స్ అంతకుముందెన్నడూ అలా మాట్లాడలేదని.. మాజీ సారథి వివరించాడు. ‘ఆ వాయిస్ మెసేజ్ వినగానే నేనూ భావోద్వేగానికి గురయ్యా. అతడితో ఎన్నో మధుర జ్ఞాపకాలు పంచుకున్నాను. అయితే, మొన్ననే.. డివిలియర్స్ గురించి ఆలోచిస్తూ.. ఇకపై మేం ఎప్పుడు కప్పు గెలిచినా.. మొదట తననే గుర్తుచేసుకోవాలనుకున్నా. బెంగళూరు కప్పు గెలవడం డివిలియర్స్కు ఎంత ఇష్టమో నాకు తెలుసు. అతడో అద్భుతమైన వ్యక్తి. బెంగళూరు ఫ్రాంఛైజీలో ప్రతి ఒక్కరి మనసు తాకాడు’ అని కోహ్లీ అన్నాడు. ఇక తాను ఎప్పటికీ ఆ జట్టుతోనే కొనసాగుతానని, ఎంత మంది ఆటగాళ్లు వచ్చిపోయినా ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యుల్లాగే భావిస్తానని చెప్పాడు. ఇక్కడ లభించిన ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ తనతోనే ఉంటాయన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!