Telangana News: నిమ్జ్ కోసం బలవంతపు భూసేకరణ.. రైతు బిడ్డ ఆవేదన
జాతీయ పెట్టుబడులు ఉత్పత్తుల మండలి (నిమ్జ్) కోసం భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు. అధికారులు ప్రకటించిన పరిహారం తమకు సరిపోదని పేర్కొంటున్నారు
హైదరాబాద్: జాతీయ పెట్టుబడులు ఉత్పత్తుల మండలి (నిమ్జ్) కోసం భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు. అధికారులు ప్రకటించిన పరిహారం తమకు సరిపోదని పేర్కొంటున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.9 లక్షలకు మించి రాదని, ఆ డబ్బుతో తమ చుట్టుపక్కల కనీసం 100 గజాల స్థలం కూడా కొనుగోలు చేయలేమని అంటున్నారు. దీంతో భూసేకరణ కోసం గ్రామాల్లోకి వెళుతున్న అధికారులకు రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
జహీరాబాద్ నిమ్జ్ కోసం అధికారుల బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ బాధిత రైతు కుమార్తె ఆవేదనతో విడుదల చేసిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగి గ్రామానికి చెందిన రైతు రాజారెడ్డి కుమార్తె అక్షయ నిమ్జ్ రైతుల దయనీయ స్థితిపై విడుదల చేసిన ఒకటిన్నర నిమిషాల వీడియో సర్వత్రా చర్చనీయాశంగా మారింది. రైతులు భూములు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్నప్పటికీ అధికారులు మాత్రంం సిద్ధమని ప్రకటించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. భూముల విక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్లు బ్లాక్ చేయడం, 3 పంటలు పండే భూములు పండవని చూపడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫాల్లో జరిగిన భూ బాధితుల సమావేశాల్లో పాల్గొన్నానని, భవిష్యత్తులో జరిగే ఆందోళనల్లోనూ పాల్గొంటానని స్పష్టం చేయడం జహీరాబాద్ ప్రాంత ప్రజలను ఆలోచింపజేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434