YS Sharmila: ప్రభుత్వానికి మానవత్వం లేదా?: వైఎస్షర్మిల
తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. వయసు పరిమితి లేకుండా రైతు బీమా పథకం అమలు చేయాలని కోరారు. కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించడం లేదన్న షర్మిల.. కేసీఆర్ స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను తీర్చాలని ఆమె సీఎంకు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా షర్మిల హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.
‘‘రుణమాఫీ చేస్తానని సీఎం చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? కేవలం రూ.25వేలు లోపు రుణం ఉన్న మూడు లక్షల మందికి మాత్రమే చేశారు. 36 లక్షల మందికి రైతులను తెరాస మోసం చేసింది. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలు అలాగే ఉన్నాయి. వాటికి అన్నదాతలే వడ్డీలు కడుతున్నారు.
ఇప్పటికే రుణాలు తీసుకున్నందు వల్ల రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తీర్చలేక ఒత్తిడితో అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదా?’’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434